News March 21, 2024
నెక్ట్స్ టార్గెట్ కేజ్రీవాల్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1711026413974-normal-WIFI.webp)
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో ‘పెద్ద తలకాయలు’ ఉన్నాయంటూ మొదటినుంచీ అనుమానిస్తున్న ఈడీ.. ఇప్పటికే ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేసింది. ఇక నెక్ట్స్ టార్గెట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాలేనని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు పలుమార్లు నోటీసులు ఇచ్చిన ఈడీ త్వరలోనే అరెస్ట్ చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి.
Similar News
News July 5, 2024
కస్టమర్ల డేటా లీక్.. ఖండించిన ఎయిర్టెల్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720179590576-normal-WIFI.webp)
తమ కస్టమర్ల డేటా హ్యాక్ కాలేదని టెలికాం సంస్థ ఎయిర్టెల్ స్పష్టం చేసింది. తమ ప్రతిష్ఠ దిగజార్చడానికే కొంతమంది కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. తమ సెక్యూరిటీ వ్యవస్థలోకి ఇప్పటివరకు ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవని పేర్కొంది. డేటా భద్రతలో ఎలాంటి లొసుగులు లేవని తేల్చిచెప్పింది. కాగా ఓ హ్యాకర్ ఎయిర్టెల్ కస్టమర్లకు సంబంధించిన డేటాను ఆన్లైన్లో రూ.50 వేల డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి.
News July 5, 2024
కొలెస్ట్రాల్ తగ్గించే ఇంజెక్షన్లు ఇన్సూరెన్స్లో కవర్ అవుతాయా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720176499212-normal-WIFI.webp)
కొలెస్ట్రాల్ తగ్గించే కాస్ట్లీ ఇంజెక్షన్లు భారత్లోనూ రానున్న నేపథ్యంలో ఇవి ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తాయా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ‘కేంద్రం ఆమోదంతో ఈ చికిత్స హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చినా ఆస్పత్రి ఖర్చులే కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంజెక్షన్ ఖర్చును (₹1.25లక్షలు) పేషెంటే భరించాలి. చికిత్సకు ముందు మీ ఇన్సూరర్ను సంప్రదించడం లేదా పాలసీ చెక్ చేసుకోవడం మంచిది’ అని నిపుణులు సూచిస్తున్నారు.
News July 5, 2024
‘మిస్టర్ బచ్చన్’ రిలీజ్ డేట్ ఫిక్స్?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1720170104588-normal-WIFI.webp)
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న ‘మిస్టర్ బచ్చన్’ మూవీ ఆగస్టు 15న విడుదల కానున్నట్లు తెలుస్తోంది. 14న ప్రీమియర్స్ వేయనున్నట్లు సమాచారం. దీనిపై మూవీ మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వాల్సి ఉంది. హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.