News December 11, 2024

వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: CM CBN

image

AP: దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్‌లో సగం కూడా ఇవ్వడంలేదు. వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం. దీపం-2 పథకం కింద 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం. సంక్రాంతి నాటికి ఆర్అండ్‌బీ రోడ్లపై గుంతలు ఉండకూడదు’ అని కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు.

Similar News

News October 19, 2025

పండ్ల తోటలు: కొమ్మల కత్తిరింపులో జాగ్రత్తలు

image

పండ్ల తోటల్లో కొమ్మ కత్తిరింపుల వల్ల సూర్యరశ్మి లోపలి భాగాలకూ చేరి ఎదుగుదల బాగుంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కత్తిరింపు పరికరాలను సోడియం హైపో/బ్లీచింగ్ పౌడర్ ద్రావణంలో ముంచిన తర్వాతే వాడుకోవాలి. లేదంటే ఏవైనా వ్యాధులు ఇతర చెట్లకు వ్యాపిస్తాయి. కత్తిరింపులు పూర్తయ్యాక చెట్ల భాగాలకు బ్లైటాక్స్ పేస్ట్/కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్‌తో పూత వేయాలి. అధిక వర్షాలున్నప్పుడు కత్తిరింపులు చేయరాదు.

News October 19, 2025

ఐఐటీ ధన్‌బాద్‌లో ఉద్యోగాలు

image

IIT ధన్‌బాద్ 10 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ సూపరింటెండెంట్(లైబ్రరీ), జూనియర్ టెక్నీషియన్( లైబ్రరీ), జూనియర్ టెక్నీషియన్ (మెడికల్) పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి M.Lib.Sc/MLISc, పీజీ, B.Lib.Sc, BLISc,పీజీ డిప్లొమా, ఫార్మసీ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్‌సైట్: https://www.iitism.ac.in/

News October 19, 2025

21న ‘మూరత్ ట్రేడింగ్’.. ఈ ఏడాది మారిన టైమింగ్

image

దీపావళి సందర్భంగా ఈ నెల 21న ప్రత్యేక ‘మూరత్ ట్రేడింగ్’ జరగనుంది. మధ్యాహ్నం 1.45 నుంచి 2.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు BSE, NSE ప్రకటించాయి. ప్రతిఏటా సాయంత్రం పూట ఈ సెషన్ జరిగేది. అయితే ఈ సారి సంప్రదాయానికి భిన్నంగా మధ్యాహ్నం నిర్వహించనున్నారు. లక్ష్మీ పూజను పురస్కరించుకొని గంటపాటు జరిగే ఈ ట్రేడింగ్‌లో ఒక్క షేర్ అయినా కొనాలని ఇన్వెస్టర్లు భావిస్తారు. కాగా 21, 22 తేదీల్లో స్టాక్ మార్కెట్లకు సెలవు.