News December 11, 2024
వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: CM CBN

AP: దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వడంలేదు. వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం. దీపం-2 పథకం కింద 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం. సంక్రాంతి నాటికి ఆర్అండ్బీ రోడ్లపై గుంతలు ఉండకూడదు’ అని కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు.
Similar News
News January 22, 2026
సహజీవనంలో మహిళకు భార్య హోదా ఇవ్వాలి: హైకోర్ట్

లివింగ్ రిలేషన్లో ఉండే మహిళలకు గాంధర్వ వివాహం/ప్రేమపెళ్లి కింద ‘భార్య’ హోదా కల్పించాలని మద్రాస్ హైకోర్ట్ అభిప్రాయపడింది. పెళ్లిపేరుతో ఓ యువతిని మోసం చేసిన వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేస్తూ జస్టిస్ శ్రీమతి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రాచీన భారతదేశంలోని 8 వివాహాల్లో గాంధర్వ వివాహం ఒకటి. సహజీవనాన్ని ఈ వివాహంగా గుర్తించొచ్చు. ఈ విషయాల్లో BNSలోని Sec68 మహిళలకు రక్షణ కల్పిస్తుంది’ అని తెలిపారు.
News January 22, 2026
భర్తను చంపి.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ..

AP: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. డెడ్బాడీ పక్కన కూర్చొని రాత్రంతా పోర్న్ వీడియోలు చూసింది. గుంటూరు దుగ్గిరాల (M)కు చెందిన శివనాగరాజుకి భార్య లక్ష్మీమాధురి బిర్యానీలో 20 నిద్రమాత్రల పొడి కలిపి పెట్టింది. భర్త స్పృహ కోల్పోయాక ప్రియుడు గోపితో కలిసి దిండుతో ఊపిరాడకుండా చేసి హత్య చేసింది. గుండెపోటుతో మరణించాడని నమ్మబలికింది. చెవిలో రక్తం కనిపించడంతో పోలీసులు అసలు విషయం బయటకు లాగారు.
News January 22, 2026
నేడు అందుబాటులోకి కళ్యాణోత్సవం టికెట్లు

AP: తిరుమల శ్రీవారి ఏప్రిల్ కోటా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ టికెట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు TTD విడుదల చేయనుంది. వీటితోపాటు వర్చువల్ సేవ టికెట్లను కూడా రిలీజ్ చేస్తోంది. 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి ట్రస్టు, 24న (అకామిడేషన్) రూమ్స్, రూ.300 దర్శన టికెట్లు విడుదల చేయనున్నట్టు తెలిపింది. భక్తులు అధికారిక వెబ్సైట్ https://ttdevasthanams.ap.gov.inలో మాత్రమే టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించింది.


