News December 11, 2024
వచ్చే ఏడాది టీచర్ పోస్టుల భర్తీ: CM CBN

AP: దేశంలో ఎక్కువ పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వడంలేదు. వచ్చే ఏడాది స్కూళ్ల ప్రారంభం నాటికి టీచర్ పోస్టులను భర్తీ చేస్తాం. దీపం-2 పథకం కింద 40 లక్షల మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశాం. సంక్రాంతి నాటికి ఆర్అండ్బీ రోడ్లపై గుంతలు ఉండకూడదు’ అని కలెక్టర్ల సదస్సులో సీఎం ఆదేశించారు.
Similar News
News December 27, 2025
18ఏళ్లైనా న్యాయం జరగలేదు: ఆయేషా పేరెంట్స్

AP: తమ కూతురు ఆయేషా <<10606883>>మీరా<<>> హత్య జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా ఇంకా న్యాయం జరగలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో సీబీఐ, సిట్ విఫలమయ్యాయని మహిళా కమిషన్ను కలిసి ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ కూడా సరిగ్గా చేయలేదని ఆరోపించారు. సామాన్యులకు న్యాయం జరగదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. డిసెంబర్ 27ను ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలని వినతిపత్రంలో కోరారు.
News December 27, 2025
51 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

<
News December 27, 2025
పూజలో ఈ పొరపాట్లు ఫలితాలనివ్వవు..

పూజలో కొన్ని నియమాలు పాటిస్తేనే పూర్తి ఫలితం లభిస్తుంది. పూజా స్థలాన్ని, విగ్రహాలను శుభ్రంగా ఉంచుకోవాలి. వాడిపోయిన పూలు, మురికి పాత్రలు వాడితే పూజ శక్తి తగ్గుతుంది. పూజను తొందరగా ముగించే పనిలా కాకుండా, ఏకాగ్రతతో ముహూర్త సమయాలను అనుసరించి చేయాలి. విగ్రహాలను నేల మీద పెట్టకుండా సరైన పీఠంపై ఉంచాలి. పూజ పూర్తయ్యాక పాత వస్తువులను తొలగించి, ఆ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచితే ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుంది.


