News April 17, 2025
NGKL:ఆ చట్టం ద్వారా భూసమస్యలకు శాశ్వత పరిష్కారం: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంతో రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. కలెక్టరేట్లో రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండ రెడ్డి, రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.కలెక్టర్ పాల్గొని మాట్లాడుతూ..భూభారతి చట్టంపై ఏప్రిల్ 17నుంచి 30వరకు రైతులకు మండలాల వారీగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Similar News
News April 19, 2025
HYD: కాలేజీల్లో మే నుంచి ఫేషియల్ అటెండెన్స్

HYDలోని గాంధీ, ఉస్మానియా వివిధ ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలలో మే 1వ తేదీ నుంచి ఆధార్ ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ అమలు చేయాలని అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలిపారు. ఇటీవల జాతీయ వైద్య కమిషన్ ఈ నిర్ణయాన్ని తీసుకుందని, ఫేషియల్ అటెండెన్స్ తప్పనిసరిగా ఉంటుందని పేర్కొన్నారు.
News April 19, 2025
JEE టాప్-10 ర్యాంకర్స్ వీరే

JEE ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఇందులో రాజస్థాన్కు చెందిన ఇద్దరు తొలి రెండు ర్యాంకుల్లో నిలిచారు. మూడు, నాలుగు ర్యాంకులను పశ్చిమ బెంగాల్కు చెందిన విద్యార్థులు కైవసం చేసుకున్నారు. 1.MD అనాస్, 2.ఆయుష్ సింఘాల్(RJ), 3.అర్చిష్మాన్ నాండీ, 4.దేవదత్త మాఝీ(WB), 5.రవి చౌదరి(MH), 6.లక్ష్య శర్మ(RJ), 7.కుషాగ్ర గుప్తా(KN), 8.హర్ష్ ఏ గుప్తా(TG), 9.ఆదిత్ ప్రకాశ్ భగాడే(GJ), 10.దక్ష్ (DL).
News April 19, 2025
30 ఏళ్లు దాటిన మహిళలకు అలర్ట్!

మహిళల ఆరోగ్యం పాడైతే ఇల్లు అనే బండి సాఫీగా కదలదు. ముఖ్యంగా ఇంటి పనులతో పాటు జాబ్ చేసే ఆడవారికి 30 ఏళ్లు దాటితే ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు. వారంతా గర్భాశయ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్ష(HPV), రొమ్ము క్యాన్సర్ టెస్ట్, బ్లడ్ షుగర్తో పాటు కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఈ పరీక్షల్లో ఏదైనా జబ్బు బయటపడితే తొందరగా నయం చేసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.