News March 18, 2025
NGKL: ‘అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు.
Similar News
News November 27, 2025
సిరిసిల్ల: కంట్రోల్ రూమ్ను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు

గ్రామ పంచాయతీ ఎన్నికల సాధారణ పరిశీలకులు రవి కుమార్ గురువారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్, హెల్ప్లైన్, మీడియా సెంటర్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఫిర్యాదుల వివరాలను ఆరా తీశారు. ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదులన్నింటినీ కచ్చితంగా రికార్డులో నమోదు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
News November 27, 2025
9,10 విద్యార్థులు మెట్రిక్ స్కాలర్షిప్ నమోదు చేసుకోవాలి: రాధిక గుప్తా

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని, 9, 10వ తరగతి చదువుతన్న షెడ్యూల్డ్ కులాల విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ నమోదుకు అదనపు కలెక్టర్ రాధికాగుప్త అధ్యక్షతన గూగుల్ మీటింగ్ జరిగింది. జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి జి.వినోద్ కుమార్, జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఝాన్సీ రాణి, డీఎంహెచ్వో విజయలక్ష్మి, లీడ్ బ్యాంక్ మేనేజర్ శివ ప్రసాద్, మండల అధికారి పాల్గొన్నారు.
News November 27, 2025
ఖమ్మం జిల్లాలో తొలి రోజు 99 సర్పంచి నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మొదటి విడతలో 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా సర్పంచ్ అభ్యర్థులుగా 99 మంది నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. అలాగే, 1,740 వార్డులకు గాను 49 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ అనుదీప్ ఒక ప్రకటనలో తెలిపారు.


