News March 18, 2025
NGKL: ‘అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి’

కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నప్పటికీ ఫలితం లేకుండా పోయిందని అన్నారు.
Similar News
News October 23, 2025
కర్నూలు జిల్లాలో 52,076 ఇళ్లు మంజూరు

కర్నూలు జిల్లా వ్యాప్తంగా అర్హులైన పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం 52,076 ఇళ్లు మంజూరు చేసిందని జిల్లా కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు ప్రతి సచివాలయ పరిధిలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. లబ్ధిదారులకు ఏవైనా సందేహాలు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 08518-257481ను సంప్రదించాలని సూచించారు.
News October 23, 2025
అభ్యంగన స్నానం వెనుక ఆంతర్యమిదే!

శరీరాద్యంతము తైలమును అంటుకోవడమే అభ్యంగనం. అనగా ఆముదము గానీ, నువ్వుల నూనె గానీ, నెయ్యి, వెన్న మొదలైన ఏదో ఒక తైలమును శరీరమంతా బాగా పట్టించి కనీసం 30 నిమిషాల తర్వాత శీకాయపొడి కానీ, పెసరపిండి కానీ, శనగపిండి గానీ ఉపయోగించి గోరువెచ్చటి నీటితో స్నానము చేయాలి. ఇది ఆధ్యాత్మిక నియమమే కాదు. ఆరోగ్యకరం కూడా! అందుకే పండుగల్లో దీన్ని విధిగా ఆచరించాలని మన పెద్దలు సూచిస్తుంటారు. కార్తీక మాసంలో ఈ నియమం ముఖ్యం.
News October 23, 2025
ఆదిలాబాద్: గంపెడు పిల్లలున్నా అవకాశం

స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు అధిక సంతానం ఆంక్ష తొలగనుంది. ఇద్దరి కంటే ఎక్కువగా పిల్లలున్నా పోటీకి అర్హత కల్పించేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేయనుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన బిల్లుపై మంత్రి సీతక్క సంతకం కూడా చేశారు. 42% బీసీ రిజర్వేషన్పై హై కోర్ట్ స్టే ఇవ్వడంతో లోకల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. దీనిపై ఆసిఫాబాద్ జిల్లాలో చర్చ జరుగుతోంది.