News March 28, 2025

NGKL: అనాథ బాలికల వసతిగృహంలో ఆకస్మిక తనిఖీ

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వాత్సల్య అనాధ బాలికల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ సెక్రటరీ సబిత గురువారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనాథ వసతిగృహంలో గదులను పరిశీలించారు. అందులో నివసిస్తున్న బాలికలకు అందిస్తున్న ఆహారాన్ని ఆమె పరిశీలించారు. డోనర్స్ అందించిన వస్తువులను బాలికలకు అందించడం లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వాష్ రూమ్‌లు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

Similar News

News November 7, 2025

RGM: 12న క్యాబినెట్ మీటింగ్ వల్ల 16వ తేదీకి వాయిదా

image

సింగరేణి సంస్థలు మెడికల్ పూర్తిచేసిన 473 మంది అభ్యర్థులు ఈనెల 16న కొత్తగూడెంలో నిర్వహించే కార్యక్రమాలలో నియామక పత్రాలు తీసుకుంటారని ఐఎన్టీయుసీ రామగుండం నాయకులు గడ్డం తిరుపతి యాదవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. కారుణ్య నియామకం పద్ధతిలో అభ్యర్థులు ఉపాధి పొందనున్నారని అన్నారు. 12న క్యాబినెట్ మీటింగ్ వల్ల 16వ తేదీకి వాయిదా వేయడం జరిగిందన్నారు.

News November 7, 2025

GDK: బంగారు పతకాలు అందుకున్న ఎంబీఏ విద్యార్థులు

image

గోదావరిఖని యూనివర్సిటీ పీజీ కళాశాలకు చెందిన ఆరుగురు ఎంబీఏ విద్యార్థులు బంగారు పతకాలను అందుకున్నారు. అత్యుత్తమ మార్కులు సాధించినందుకు గాను డీ.తరుణ, ఎం.మౌనిక, డీ.ఉషశ్రీ, పీ.కళ్యాణి, కే.కళ్యాణి, సీహేచ్‌.సాగరికలు బంగారు పతకాలకు ఎంపికయ్యారు. శాతవాహన యూనివర్సిటీలో జరిగిన ద్వితీయ స్నాతకోత్సవం సందర్భంగా గవర్నర్‌ విష్ణుదేవ్‌ వర్మ చేతుల మీదుగా ఈ బంగారు పతకాలు అందుకున్నారు.

News November 7, 2025

GNT: సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

శంకర కంటి ఆసుపత్రి కార్యక్రమంలో పాల్గొనేందుకు ఈ నెల 9న సీఎం చంద్రబాబు విచ్చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం కలెక్టర్ తమీమ్ అన్సారియా పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పెదకాకాని మండలంలో హెలిపాడ్, సీఎం పాల్గొనే ప్రదేశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు ఆదేశాలను జారీ చేశారు. కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.