News April 2, 2025

NGKL: అమ్మాయిపై గ్యాంగ్ రేప్.. దుండగులను శిక్షించాలని డిమాండ్ 

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఊరుకొండ ఆంజనేయస్వామి దైవ దర్శనానికి వెళ్లిన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు పరుశురాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత మత్తు పదార్థాలకు బానిసై ఇలాంటి దుర్ఘటనలకు బాధ్యులు కావద్దని వారన్నారు. అలాగే బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటామని అన్నారు.

Similar News

News January 7, 2026

తుఫాన్ల నుంచి రక్షణకు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఏపీ

image

AP: తరచూ తుఫాన్లు వచ్చి రాష్ట్రానికి ఎంతో నష్టం చేస్తున్నాయి. ఆ విపత్తుల నుంచి తీరప్రాంతాన్ని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టులు చేపట్టనుంది. ఇందులో భాగంగా తీరప్రాంతంలో 5 కి.మీ. వెడల్పున మాంగ్రూవ్స్, సరుగుడు, ఈత చెట్లు నాటుతారు. జనవరి నెలాఖరు నాటికి క్లియర్ రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం పవన్ అధికారులను ఆదేశించారు.

News January 7, 2026

గోదావరిఖనిలో 75 రోజుల్లో క్యాత్ లాబ్..!

image

గోదావరిఖనిలో 75 రోజుల్లో క్యాత్ లాబ్ (మెడికల్ బెనిఫిట్స్) ప్రారంభించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. టెండర్ ప్రక్రియ కూడా పూర్తయినట్లు సమాచారం. సింగరేణి ఆసుపత్రుల్లో ఖాళీగా ఉన్న డాక్టర్స్, పారామెడికల్ పోస్టులు నెల చివరికి భర్తీ చేయనున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు రూ.8 లక్షల వరకు మందులు, సింగరేణి ఉద్యోగులకు రూ.కోటి బీమా సౌకర్యం కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి అసెంబ్లీలో తెలిపారు.

News January 7, 2026

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సీఎం సోదరుడికి సిట్ పిలుపు

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ సోదరుడు కొండల్ రెడ్డికి సిట్ నోటీసులిచ్చింది. గతంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. దీంతో రేపు ఉదయం సిట్ ఎదుట హాజరుకావాలని సూచించారు.