News April 3, 2025

NGKL: అమ్మాయిలు ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తున్నారా.. జాగ్రత్త..!

image

మహిళలకు రక్షణ, భద్రత కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో షీ టీం పనిచేస్తోందని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ఎస్పీ సీహెచ్ రామేశ్వర్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. మహిళలు సామాజిక మధ్యమాలైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వినియోగంలో పలు జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేసే సమయంలో వ్యక్తిగత భద్రతకు సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.

Similar News

News December 16, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు!

image

ఈనెల 17న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ ప్రీత్ సింగ్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించారు.

News December 16, 2025

పోలింగ్ కేంద్రాల వద్ద 200 మీటర్ల పరిధిలో నిషేధాజ్ఞలు!

image

ఈనెల 17న మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వరంగల్, హన్మకొండ, జనగామ జిల్లాల పరిధిలోని పోలింగ్ కేంద్రాల వద్ద నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని సీపీ ప్రీత్ సింగ్ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటం నిషేధించారు.

News December 16, 2025

మెదక్: దంపతులిద్దరూ వార్డు సభ్యులు.. భర్త ఉపసర్పంచ్

image

మనోహరాబాద్ మండలం కాళ్లకల్ మేజర్ గ్రామపంచాయతీకి ఆదివారం ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. నిన్న జరిగిన ఎన్నికల్లో కాళ్లకల్ గ్రామపంచాయతీ ఆరో వార్డు సభ్యులుగా వీరబోయిన ప్రవీణ్ కుమార్ ముదిరాజ్ ఎన్నిక కాగా, భార్య వీరబోయిన మమత ముదిరాజ్ ఏడో వార్డు సభ్యురాలుగా ఎన్నికయ్యారు. సోమవారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో ప్రవీణ్ కుమార్ ఉపసర్పంచిగా సభ్యుల మద్దతుతో ఎన్నికయ్యారు.