News March 16, 2025

NGKL: అయ్యో పాపం.. చిన్నారి మృతి

image

బల్మూరు మండలం చిన్నారి సంపులో పడి మృతిచెందిన ఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. కొండనాగులకి చెందిన చింత మహేశ్, సుస్మిత దంపతులకు చిన్నారి నాన్సీ(2) ఉంది. ఆడుకుంటూ పక్కింటికి వెళ్లింది. చిన్నారిని ఎవరూ గమనించకపోవటంతో ఇంటి ఎదుట ఉన్న సంపులో పడింది. కొంత సేపటికి గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని బయటికి తీయగా అప్పటికే మృతిచెందింది.

Similar News

News November 28, 2025

HYD: ప్లీజ్.. పిల్లలను టెన్షన్ పెట్టకండి

image

పేట్ బషీరాబాద్ PS పరిధిలో స్కూల్ ఫీజు చెల్లించలేకపోవడంతో 8వ తరగతి విద్యార్థి సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. తప్పు యాజమాన్యానిదైనా.. తల్లిదండ్రులదైనా ఘోరం జరిగిపోయింది. చదువుకోవాలని ఉన్నా చదువు”కొనలేని” స్థితిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులూ ఇప్పటికైనా మారండి మేనేజ్ మెంట్‌తో మాట్లాడండి. పిల్లలకు సర్దిచెప్పండి. యాజమాన్యాలు కఠిన వైఖరి తగ్గించాలి. లేకపోతే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి.

News November 28, 2025

12 కాదు.. వచ్చే ఏడాది 13 మాసాలు ఉంటాయి!

image

సాధారణంగా ఏడాదికి 12 మాసాలే ఉంటాయి. అయితే 2026, MAR 30న మొదలయ్యే పరాభవ నామ సంవత్సరంలో 13 మాసాలు ఉంటాయని పండితులు చెబుతున్నారు. జ్యేష్ఠానికి ముందు అధిక జ్యేష్ఠం రావడమే దీనికి కారణం. ‘దీనిని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. ఇది శ్రీమహా విష్ణువుకు ప్రీతిపాత్రం. అధిక మాసంలో పూజలు, దానధర్మాలు, జపాలు చేస్తే ఎంతో శ్రేష్ఠం’ అని పండితులు సూచిస్తున్నారు. SHARE IT

News November 28, 2025

పరకామణి దోషులకు శిక్ష పడాలి: YV సుబ్బారెడ్డి

image

పరకామణి అక్రమాలపై పక్కాగా విచారణ జరగాలని, దోషులకు కోర్టు ద్వారా శిక్ష పడాలని TTD మాజీ ఛైర్మెన్ YV సుబ్బారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన విజయవాడలో CID విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం ‘భక్తుల మనోభావాలను రాజకీయాలకు వాడవద్దు. తిరుమల లడ్డూ, పరకామణి ఘటనలను అడ్డం పెట్టుకొని వివాదాలు రేపుతున్నారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని మేమే చెబుతున్నాం. నన్ను పిలిచినా, భూమనను పిలిచినా విచారణ కోసమే’ అని YV అన్నారు.