News April 9, 2025
NGKL: ‘ఆదాయ అభివృద్ధికై వ్యవసాయ పరిశోధనలు సాగాలి’

బిజినేపల్లి మండల పరిధి పాలెంలో ప్రొ.జయశంకర్ దక్షిణ తెలంగాణ వ్యవసాయ ప్రాంతీయ పరిశోధన కేంద్రం ఆడిటోరియంలో వ్యవసాయ విస్తరణ, సలహా సంఘ సమావేశానికి కలెక్టర్ బాదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా రాబోయే వాతావరణ మార్పులకు అనుగుణంగా రైతులకు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం వచ్చేలా పరిశోధనలు ఉండాలన్నారు. రైతులందరూ వ్యవసాయ శాస్త్రవేత్తల సలహాలు సూచనలు పాటించి వ్యవసాయం చేయాలని సూచించారు.
Similar News
News February 23, 2026
నేడు విశాఖ పోలీస్ కమిషనరేట్లో PGRS

విశాఖపట్టణం సిటీ పోలీస్ కమిషనరేట్లో ప్రతి సోమవారం “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలు తమ సమస్యలను నేరుగా కమిషనర్కు విన్నవించుకోవచ్చు. అందిన ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుని పరిష్కారం చూపిస్తామని సీపీ శంఖబ్రత బాగ్చి తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ స్పందన కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు.
News February 23, 2026
పార్వతీపురం: నేటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని అన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని స్పష్టం చేశారు.
News February 23, 2026
పార్వతీపురం: నేటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు

జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని అన్నారు. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరని స్పష్టం చేశారు.


