News March 22, 2025
NGKL: ఆ పథకం దరఖాస్తుకు ఈనెల 31 లాస్ట్!

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ పథకం 2025 ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈనెల 31 చివరి తేదీ జిల్లా అధికారి షాబుద్దీన్ తెలిపారు. 21-24 వయసు, పదోతరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లమా, బ్యాచిలర్ డిగ్రీ పూర్తయి ఉన్న వారు అర్హులు. నెలకు రూ.5000 చొప్పున ఏడాది పాటు అభ్యర్థుల ఖాతాలో నేరుగా జమ చేస్తారని తెలిపారు.
Similar News
News March 26, 2025
రేపే ఉప ఎన్నికలు.. కూటమికి విజయం దక్కేనా.?

చిత్తూరు జిల్లా పరిధిలో బుధవారం MPP ఉప ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలోని రామకుప్పం, తవణంపల్లి, సదుం, విజయపురం (వైస్ ఎంపీపీ), పెనుమూరు (కో-ఆప్షన్ సభ్యులు)లకు అధికారులు ఎన్నికలు నిర్వహించనున్నారు. కాగా ఉప ఎన్నికలు జరిగే స్థానాలన్నింటినీ తమ ఖాతాలో వేసుకోవాలని కూటమి చూస్తోంది. సదుం సహా పలు చోట్ల YCP, కూటమి మధ్య గట్టి పోటీ నెలకొంటుంది. ఇప్పటికే అన్ని ఏర్పాటు పూర్తి చేసినట్లు JC విద్యాధరి స్పష్టం చేశారు.
News March 26, 2025
సోనూసూద్ భార్యకు యాక్సిడెంట్.. ఇప్పుడెలా ఉందంటే?

రోడ్డు <<15881657>>ప్రమాదంలో<<>> గాయపడ్డ నటుడు సోనూసూద్ భార్య సోనాలీ ప్రస్తుతం కోలుకుంటున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాగ్పూర్ మ్యాక్స్ ఆసుపత్రి ప్రకటన విడుదల చేసింది. కోల్కతా నుంచి వచ్చిన సోనాలీని ఆమె సోదరి సునీత, మేనల్లుడు సిద్ధార్థ్ ఎయిర్పోర్టులో రిసీవ్ చేసుకొని ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉన్నా ఎయిర్బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాలకు ముప్పు తప్పింది.
News March 26, 2025
యాడ్ ఫ్రీ ఇన్స్టా కోసం సబ్స్క్రిప్షన్.. ఎక్కడంటే?

యాడ్ ఫ్రీ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ కోసం సబ్స్క్రిప్షన్ను తేవాలని ‘మెటా’ యోచిస్తోంది. తాజాగా యూరప్లో ఈ విధానాన్ని అమలుచేసేందుకు సిద్ధమైంది. యూరోపియన్ నియంత్రణ సంస్థలకు ‘మెటా’ తన ప్రతిపాదలను పంపింది. మొబైల్లో యాడ్ఫ్రీ ఇన్స్టా కోసం నెలకు $14(రూ.1200), డెస్క్టాప్లో FB& INSTA కోసం 17 డాలర్ల వరకు ఉండనుంది. అక్కడ అమలైతే అన్నిచోట్లా తీసుకొచ్చే అవకాశం ఉందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు.