News March 9, 2025

NGKL: ఆ మృతదేహం గురు ప్రీత్ సింగ్‌దే: బైద్య

image

SLBC టన్నెల్‌లో నుంచి వెలికితీసిన మృతదేహం రాబిన్స్ కంపెనీకి చెందిన గురుప్రీత్‌సింగ్‌దే అని సింగరేణి జనరల్ మేనేజర్ బైద్య తెలిపారు. కాంక్రీట్‌లో కూరుకుపోయిన మృతదేహం ఒక చేయి బయటకు రావటంతో ఆ ప్రాంతంలో తీవ్రంగా శ్రమించిన రెస్క్యూ సిబ్బంది మృతదేహాన్ని వెలికితీసినట్లు ఆయన వివరించారు. 

Similar News

News September 19, 2025

వృద్ధుల సంక్షేమంపై ములుగు ఆర్డీఓ కీలక సూచనలు

image

వయోవృద్ధులు తమ ఆస్తిని బదలాయించేటప్పుడు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్‌లో ‘పోషణ, సంక్షేమం’ నిబంధనలను తప్పకుండా పొందుపరచాలని ఆర్డీఓ వెంకటేశ్ అన్నారు. ఆస్తి పొందినవారు నిబంధనలు పాటించకపోతే, వృద్ధుల సంక్షేమ చట్టం-2007 ప్రకారం ఆస్తిని రద్దు చేసే అధికారం ఉంటుందని తెలిపారు.

News September 19, 2025

మోసపూరిత ప్రకటనలు నమ్మొద్దు: వరంగల్ పోలీసులు

image

సోషల్ మీడియా ద్వారా బంపర్ ఆఫర్లు, బహుమతుల పేరిట వస్తున్న మోసపూరిత ప్రకటనలను నమ్మవద్దని వరంగల్ పోలీసులు ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తక్కువ ధరకే వస్తువులు ఇస్తామంటూ వచ్చే లింకులు, స్పిన్ వీల్ లేదా స్క్రాచ్ కార్డుల పేరుతో వచ్చే సందేశాలు పూర్తిగా మోసపూరితమని అధికారిక ఫేస్‌బుక్ పేజీ ద్వారా ప్రజలకు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి లింకులను క్లిక్ చేయకుండా జాగ్రత్త వహించాలని కోరారు.

News September 19, 2025

కరేడులో భూములు లాక్కోవడం లేదు: అనగాని

image

AP: నెల్లూరు(D) ఉలవపాడు(M) కరేడులో ఇండోసోల్ కంపెనీ కోసం రైతుల నుంచి భూములు లాక్కోవడం లేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. నష్టపరిహారం ఎకరాకు రూ.20 లక్షలుగా నిర్ణయించడంతో రైతులే సమ్మతించి భూములు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారన్నారు. ఇప్పటికే 500 ఎకరాలు ఇచ్చేందుకు రైతులు ఒప్పుకోగా, 300 ఎకరాలకు నష్టపరిహారం కూడా చెల్లించామన్నారు. మండలిలో YCP MLC మాధవరావు అడిగిన ప్రశ్నకు పైవిధంగా సమాధానమిచ్చారు.