News February 28, 2025
NGKL: ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్

ఇంటర్ పరీక్షలు సజావుగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ అమరేందర్ తెలిపారు. గురువారం నాగర్కర్నూల్ కలెక్టరేట్లో మాట్లాడుతూ.. పరీక్షలలో ఎటువంటి పొరపాట్లకు అవకాశం లేకుండా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 33 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు 6,477, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 6,977 మంది హాజరవుతున్నారు. పరీక్ష కేంద్రాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు.
Similar News
News December 1, 2025
రేపు హైకోర్టుకు పరకామణి కేసు నివేదిక

AP: టీటీడీ పరకామణి కేసు విచారణ నేటితో పూర్తి కానుంది. రేపు సీఐడీ అధికారులు హైకోర్టుకు నివేదిక సమర్పించనున్నారు. హైకోర్టు ఆదేశాలతో అక్టోబర్ 27 నుంచి సీఐడీ.. టీటీడీ మాజీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, మాజీ ఈవో ధర్మారెడ్డి సహా 35 మందిని విచారించింది. విచారణకు హాజరవుతూ అప్పటి AVSO సతీశ్ అనుమానాస్పదంగా మరణించారు. చెన్నై, బెంగళూరు, విశాఖలో నిందితుడు రవికుమార్ ఆస్తులను పరిశీలించింది.
News December 1, 2025
HYD: ఇష్టారీతిగా ప్రైవేట్ స్కూల్ ఫీజులు వసూళ్లు!

నగరంలో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తమ జేబులు ఖాళీ చేయడంమే లక్ష్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. ట్యూషన్, స్పెషల్ ఫీజులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు నియంత్రణ చేపటకపోవడంతో, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు. దీనిపై సహించేది లేక విద్యాశాఖకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు యోచిస్తున్నారు.
News December 1, 2025
HYD: ఇష్టారీతిగా ప్రైవేట్ స్కూల్ ఫీజులు వసూళ్లు!

నగరంలో ప్రైవేట్ స్కూల్స్ దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. తమ జేబులు ఖాళీ చేయడంమే లక్ష్యంగా ప్రైవేట్ స్కూల్స్ ఉంటున్నాయని పేరెంట్స్ వాపోతున్నారు. ట్యూషన్, స్పెషల్ ఫీజులతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం ఫీజులు నియంత్రణ చేపటకపోవడంతో, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు రెచ్చిపోతున్నారు. దీనిపై సహించేది లేక విద్యాశాఖకు ఫిర్యాదు చేయాలని తల్లిదండ్రులు యోచిస్తున్నారు.


