News February 4, 2025

NGKL: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధిదారులు ఎంపిక

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,284 మంది రైతులను అధికారులు ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు రెండు విడతల్లో 12 వేల రూపాయలను ఇస్తామని ప్రకటించింది. మొదటి విడత ఎకరాకు 6 వేల చొప్పున నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రేషన్ కార్డు కలిగి ఉన్న రైతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పథకంలో పని చేసి ఉన్న వారిని ఎంపిక చేశారు.

Similar News

News December 6, 2025

హోంగార్డుల సేవలు అనిర్విచనీయం: కాకినాడ ఎస్పీ

image

శాంతిభద్రతల పరిరక్షణతోపాటు అనేక ఇతర శాఖలలో హోంగార్డులు అందిస్తున్న సేవలు అనిర్వచనీయమని కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు. శనివారం కాకినాడలో హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హోంగార్డులకు శుభాకాంక్షలు తెలిపారు. విధి నిర్వహణలో వారు పోలీసు శాఖకు వెన్నెముకలా నిలబడి ఉత్తమ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు.

News December 6, 2025

కార్డియాలజిస్టుల నియామకానికి కృషి: మంత్రి సుభాష్

image

కాకినాడ GGHలో కార్డియాలజీ విభాగంలో వైద్యుల నియామకం చేపట్టేందుకు కృషి చేస్తానని మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. శనివారం ఆయన GGHను ఆకస్మికంగా తనిఖీ చేసి, పలు వార్డులను పరిశీలించారు. కార్డియాలజిస్టులు లేని విషయాన్ని గుర్తించి తగు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ సందర్భంగా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి, వైద్యం అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు.

News December 6, 2025

ఐక్యమత్యంతో ర్యాంకింగ్‌కు కృషి చేద్దాం: JNTU వీసీ

image

అనంతపురం JNTUలోని ఆర్యభట్ట ఆడిటోరియంలో శనివారం “Strategic RoadMap For Improving NIRF rankings” అనే అంశంపై వర్క్‌షాప్ నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా వైస్ ఛాన్సలర్ సుదర్శన రావు, APSCHE వైస్ ఛైర్మన్ విజయ భాస్కర్ రావు పాల్గొన్నారు. వీసీ మాట్లాడుతూ.. ఐక్యమత్యంతో యూనివర్సిటీ ర్యాంకింగ్‌కు కలిసిగట్టుగా కృషి చేయాలని బోధనా సిబ్బందికి సూచించారు.