News February 4, 2025

NGKL: ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు లబ్ధిదారులు ఎంపిక

image

నాగర్ కర్నూల్ జిల్లాలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద 12,284 మంది రైతులను అధికారులు ఎంపిక చేశారు. ఈ పథకం ద్వారా రైతులకు రెండు విడతల్లో 12 వేల రూపాయలను ఇస్తామని ప్రకటించింది. మొదటి విడత ఎకరాకు 6 వేల చొప్పున నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. రేషన్ కార్డు కలిగి ఉన్న రైతులు 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు ఉపాధి హామీ పథకంలో పని చేసి ఉన్న వారిని ఎంపిక చేశారు.

Similar News

News January 21, 2026

మరో బ్లడ్ బాత్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు!

image

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఉదయం ఫ్లాట్‌గా మొదలై క్రమంగా కుప్పకూలాయి. నిఫ్టీ 25 వేల దిగువకు పడిపోయింది. 260 పాయింట్లు కోల్పోయి 24,950 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ 935 పాయింట్లు పడి 81,250 వద్ద కొనసాగుతోంది. ట్రెంట్ షేర్లు 3%, ICICI బ్యాంక్ 2.52%, BE 2.1%, L&T 1.86% నష్టపోయాయి. అటు డాలర్‌తో పోలిస్తే మన కరెన్సీ విలువ సైతం భారీగా పడిపోయింది. డాలర్‌కు రూ.91.31 వద్ద ట్రేడవుతోంది.

News January 21, 2026

గుంటూరు జీజీహెచ్‌లో కొత్త బ్లాక్.. 30న సీఎం రాక

image

గుంటూరు జీజీహెచ్‌లో రూ.100 కోట్లతో నిర్మించిన నూతన MCH బ్లాక్‌ను ఈ నెల 30న సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. పూర్వ విద్యార్థుల (GMCANA) సహకారంతో నిర్మించిన ఈ భవనంలో 597 పడకలు, ఆధునిక ICU సౌకర్యాలు ఉన్నాయి. అంతేకాక, ఏపీ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే తొలిసారిగా ఇక్కడ లివర్ మార్పిడి చికిత్సలు ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ‘జీవందాన్’ అనుమతి కూడా లభించింది.

News January 21, 2026

మాఘ మాసంలో నదీ స్నానం చేయలేకపోతే?

image

మాఘ మాసంలో నదీ స్నానం చేయలేకపోయినా, అనారోగ్యం, వృద్ధాప్యం కారణంగా నీటితో స్నానం వీలుపడకపోయినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మన పురాణాలు ఇందుకు మంత్ర, వాయువ్య, ఆగ్నేయ, కాపిల, ఆతప, మానస వంటి ప్రత్యామ్నాయ స్నాన పద్ధతులను సూచించాయి. మహావిష్ణువును మనస్ఫూర్తిగా ధ్యానిస్తూ చేసే ‘మానస స్నానం’ అన్నింటికంటే ఉత్తమమైనది. భక్తితో భగవంతుడిని స్మరిస్తే మనసు శుద్ధి అవుతుంది. ఇలా భగవంతుని కృపకు పాత్రులు కావచ్చు.