News February 15, 2025

NGKL: ఈ నెల 19వ తేదీ నుంచి 24 గంటలూ అనుమతి

image

నాగర్ కర్నూల్ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీశైల క్షేత్రానికి ఈ నెల 19వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు అటవీ శాఖ చెక్ పోస్టులో 24 గంటలూ అనుమతి ఉంటుందని శ్రీశైలం సబ్ DFO అబ్దుల్ రవూఫ్ పేర్కొన్నారు. సాధారణ రోజుల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు శ్రీశైలానికి రోడ్డు మార్గంలో ప్రయాణికులను, వాహనాలను అనుమతించరు. పాదయాత్రగా వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News February 26, 2026

నంద్యాల జిల్లా నేతలకు మంత్రి లోకేశ్ విందు

image

ఉండవల్లి నివాసంలో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గ కూటమి ప్రజాప్రతినిధులకు మంత్రి నారా లోకేశ్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరితో పాటు డోన్, ఆళ్లగడ్డ, శ్రీశైలం, బనగానపల్లె, నంద్యాల, నందికొట్కూరు, పాణ్యం ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. నియోజకవర్గాల అభివృద్ధిపై చర్చించిన అనంతరం, మంత్రి వారికి మంగళగిరి పట్టుచీరలను బహూకరించారు. అందరూ కలిసి మంత్రి ఆతిథ్యాన్ని స్వీకరించారు.

News February 26, 2026

ALERT: కాజీపేటలో కల్తీ ఐస్‌క్రీం స్వాధీనం

image

కాజీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని విష్ణుపురిలో టాస్క్ ఫోర్స్, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కల్తీ ఐస్‌క్రీంలతో పాటు గడువు తీరిన రూ.60,400 విలువలైన 12 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు పాటించని షాపు యజమానిని అదుపులోకి తీసుకున్నట్లు టాస్క్‌ఫోర్స్ ACP మధుసూదన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న సామగ్రిని విచారణ నిమిత్తం ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించారు.

News February 26, 2026

శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఆఫీసర్

image

శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారిగా కె. గోపి బాలను ప్రభుత్వం నియమించింది. బుధవారం రాత్రి ప్రస్తుతం డీపీవోగా పనిచేస్తున్న భారతి సౌజన్యను బదిలీ చేశారు. గోపి బాల శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.