News March 28, 2025

NGKL: ఉప్పునుంతలలో 40.0 గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో 25 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలు ఇలా.. అత్యధికంగా ఉప్పునుంతలలో 40.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలకపల్లి, వంగూర్, నాగర్ కర్నూల్ 39.9, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి 39.8, కోడేరు 39.7, బిజినపల్లి, చారకొండ 39.6, కొల్లాపూర్, కల్వకుర్తి 39.3, వెల్దండ 39.1, అచ్చంపేట 39.0 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News February 25, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరలు ఇలా.!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో బుధవారం బంగారం వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,780
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,518
* వెండి 10 గ్రాముల ధర రూ.2,762.

News February 25, 2026

GNT: పత్తి రైతులకు ఊరట..!

image

2025-26 పత్తి సీజన్‌లో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో రైతులకు మంచి లాభం చేకూరింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఐ ఆధ్వర్యంలో పారదర్శకంగా కొనుగోళ్లు జరగడంతో మధ్యవర్తుల ప్రభావం తగ్గింది. మొత్తం 9,862 మంది రైతుల నుంచి 6,66,439 క్వింటాళ్ల పత్తి సేకరించి రూ.518 కోట్లకు పైగా నేరుగా ఖాతాల్లో జమ చేశారు. గుంటూరులో 14 కేంద్రాల ద్వారా వేలాది క్వింటాళ్లు కొనుగోలు చేయగా పల్నాడులోనూ రికార్డు స్థాయిలో సేకరణ జరిగింది.

News February 25, 2026

జింబాబ్వేతో మ్యాచుకు రింకూ సింగ్ దూరం? శాంసన్‌కు ప్లేస్!

image

T20WC: తన తండ్రి అనారోగ్యానికి గురికావడంతో జట్టును వీడిన రింకూ సింగ్.. రేపటి జింబాబ్వేతో మ్యాచ్ ఆడటం అనుమానమేనని స్పోర్ట్స్ వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ రింకూ దూరమైతే అతడి స్థానంలో సంజూ శాంసన్ వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. నిన్న అతడు చెన్నైలో ప్రాక్టీస్ కూడా చేశారు. అటు రింకూ ఫామ్ కూడా ఆశించినంత గొప్పగా లేదు. 5 మ్యాచుల్లో కలిపి 24 రన్స్ మాత్రమే చేశారు.