News February 10, 2025

NGKL: ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి దహనం

image

బిజినేపల్లిలో కొందరు దుండగులు ఒకరి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పాత ఎంపీడీవో కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం మంటలు రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించటంతో మంటలు అదుపు చేశారు. అక్కడ వారికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆదివారం కావటంతో కార్యాలయంలో మృతదేహానికి నిప్పంటించి దహనం చేసి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 27, 2025

లక్ష్మీ నరసింహ స్వామి సేవలో నటుడు రాజీవ్ కనకాల

image

అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామిని గురువారం సినీ నటులు రాజీవ్ కనకాల, బెల్లంకొండ ప్రవీణ్, జబర్దస్త్ అశోక్ దర్శించుకున్నారు. వారికి అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం అర్చకులు నుంచి ఆశీర్వచనం అందుకున్నారు. ఆలయ ఈఓ నాగ వరప్రసాద్ వారికి స్వామి వారి ప్రసాదాలు, చిత్రపటాలను అందజేశారు. లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని రాజీవ్ కనకాల పేర్కొన్నారు.

News November 27, 2025

పెళ్లికి రెడీ.. అమ్మాయి కావాలి అంతే: చాహల్

image

భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్‌లో స్టైలిష్ ఫొటోలను షేర్ చేసిన ఈ స్పిన్నర్.. ‘నేను పెళ్లికి రెడీగా ఉన్నా. అమ్మాయి కావాలి అంతే’ అని క్యాప్షన్ పెట్టారు. భార్యతో విడాకులు అయితే చాలా మంది డిప్రెషన్‌లోకి వెళ్తారని, కానీ చాహల్ కాన్ఫిడెన్స్‌కు మెచ్చుకోవాల్సిందే అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

News November 27, 2025

ములుగు: ఎన్నికల సమాచారం కోసం కంట్రోల్ రూమ్

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఫిర్యాదులు, సమాచారం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తెలిపారు. జిల్లాలో మొదటి విడతలో 48 సర్పంచ్, 420 వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. నిర్వహణ కోసం ఫ్లయింగ్, స్టాటిస్టిక్, వీడియో సర్వేలెన్స్ బృందాలు, ఎంసీఎంసీ, ఎంసీసీ, ఇతర ఎన్నికల సంబంధిత పర్యవేక్షణ అధికారులను నియమించామని చెప్పారు.