News February 10, 2025

NGKL: ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి దహనం

image

బిజినేపల్లిలో కొందరు దుండగులు ఒకరి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పాత ఎంపీడీవో కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం మంటలు రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించటంతో మంటలు అదుపు చేశారు. అక్కడ వారికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆదివారం కావటంతో కార్యాలయంలో మృతదేహానికి నిప్పంటించి దహనం చేసి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News November 21, 2025

జర్నలిస్ట్‌లు అక్రిడేషన్‌కు దరఖాస్తు చేసుకోవాలి : DIPRO

image

2026 – 2027 సంవత్సరానికి గాను అక్రిడేషన్ ప్రక్రియ ప్రారంభమైనట్లు DIPRO, I&PR కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు. https://mediarelations.ap.gov.in/media/#/home/index లింకు ద్వారా వెంటనే రిజిస్టర్ చేసుకోవాలన్నారు. రిపోర్టర్ తమ పేరు, హోదా, మెయిల్ అడ్రస్, ఆధార్ నెంబరు, పాస్వర్డ్, ఫోన్ నెంబర్ నమోదు చేసి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్టర్ కావాలన్నారు. పూర్తి వివరాలతో దరఖాస్తును ఆన్లైన్ ద్వారా పంపించాలన్నారు.

News November 21, 2025

NZB: హమారా ‘నిఖత్’ హ్యాట్రిక్ విన్నర్

image

గ్రేటర్ నోయిడాలో గురువారం జరిగిన వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నిజామాబాద్‌కు చెందిన నిఖత్ జరీన్ గోల్డ్ మెడల్ సాధించింది. నిఖత్ 51 కేజీల విభాగంలో తైవాన్ క్రీడాకారిణిపై 5-0తో గెలిచింది. దీంతో వరుసగా 3 ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లలో గోల్డ్ మెడల్ సాధించింది. 2022, 2023, 2025 సంవత్సరాల్లో జరిగిన టోర్నీల్లో బంగారు పతకం గెలుపొందింది. 2024లో ఒలింపిక్ క్రీడల వల్ల ఈ టోర్నీలు జరగ లేదు.

News November 21, 2025

ప్రపంచ తెలుగు మహాసభలకు సిద్దిపేట కవి

image

సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లికి చెందిన కవి, రచయిత ముక్కెర సంపత్ కుమార్‌కు అరుదైన అవకాశం దక్కింది. ఆంధ్ర సరస్వత పరిషత్ ఆధ్వర్యంలో జనవరి 3, 4, 5 తేదీల్లో ఏపీలోని గుంటూరులో జరగనున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు సంపత్ ఎంపికయ్యారు. ఈ మేరకు సరస్వత పరిషత్తు అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్ ఆహ్వాన పత్రిక పంపించారు. ఈ సభల్లో దేశ, విదేశాలకు చెందిన కవులు పాల్గొననున్నారు.