News February 10, 2025

NGKL: ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి దహనం

image

బిజినేపల్లిలో కొందరు దుండగులు ఒకరి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పాత ఎంపీడీవో కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం మంటలు రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించటంతో మంటలు అదుపు చేశారు. అక్కడ వారికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆదివారం కావటంతో కార్యాలయంలో మృతదేహానికి నిప్పంటించి దహనం చేసి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News January 9, 2026

జనవరి 09: చరిత్రలో ఈరోజు

image

*ప్రవాస భారతీయుల దినోత్సవం (1915లో మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కు తిరిగివచ్చిన తేదీ)
*1969: మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభం
*1922: నోబెల్‌ బహుమతి గ్రహీత హరగోవింద్ ఖొరానా జననం (ఫొటోలో)
*1985: తెలుగు జానపద, సినీ గీతరచయిత మిట్టపల్లి సురేందర్ జననం
*1971: బంగారీ మామ పాటల రచయిత కొనకళ్ల వెంకటరత్నం మరణం

News January 9, 2026

సిద్దిపేట జిల్లాలో పలువురు ఇన్‌స్పెక్టర్ల బదిలీ

image

సిద్దిపేట జిల్లాలో పలువురు ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ మల్టీజోన్-1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్ విద్యాసాగర్, గజ్వేల్ రూరల్ సీఐ పింగళి మహేందర్ రెడ్డి, చేర్యాల సీఐ శ్రీనును బదిలీ చేయగా, రైల్వేస్‌లో పని చేస్తున్న లక్ష్మీబాబు సిద్దిపేట త్రీటౌన్ ఇన్‌స్పెక్టర్‌గా బదిలీ చేయగా, దండుగుల రవి రాజును గజ్వేల్ రూరల్ సీఐ, బానోతు రమేష్‌ను చేర్యాల సీఐగా బదిలీ చేశారు.

News January 9, 2026

సిద్దిపేట ఐటీ టవర్‌లో ఇంటర్న్‌షిప్ మేళా

image

సిద్దిపేట ఐటీ టవర్‌లోని టాస్క్(TASK) కేంద్రంలో స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మేనేజర్ నరేందర్ గౌడ్ తెలిపారు. 2024, 2025లో ఉత్తీర్ణులైన బీటెక్, బీఎస్సీ అభ్యర్థులు దీనికి అర్హులు. అభ్యర్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాథమిక కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు సొంత ల్యాప్‌టాప్ ఉండాలి. ఆసక్తి గలవారు ఈ నెల 11న ఐటీ టవర్‌లో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు.