News February 10, 2025
NGKL: ఎంపీడీవో కార్యాలయంలో వ్యక్తి దహనం

బిజినేపల్లిలో కొందరు దుండగులు ఒకరి మృతదేహాన్ని దహనం చేసిన ఘటన నిన్న చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. పాత ఎంపీడీవో కార్యాలయంలో నిన్న మధ్యాహ్నం మంటలు రావటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమందించటంతో మంటలు అదుపు చేశారు. అక్కడ వారికి ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. ఆదివారం కావటంతో కార్యాలయంలో మృతదేహానికి నిప్పంటించి దహనం చేసి ఉంటారని స్థానికులు, పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News February 17, 2026
ఖమ్మం జిల్లా అటవీశాఖ అధికారిగా కృష్ణప్రసాద్

ఖమ్మం అటవీశాఖ డివిజన్ అధికారిగా సిహెచ్ కృష్ణప్రసాద్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. జిల్లాలో అటవీ అభివృద్ధి, సంరక్షణకు ప్రాధాన్యతనిస్తామని, హరితహారం, సామాజిక అటవీ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామన్నారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన డీఎఫ్ఓకు అటవీశాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.
News February 17, 2026
చిత్తూరు: అంగన్వాడీ ఉద్యోగాల్లో అవకతవకలు.?

జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాలకు నిర్వహించిన ఇంటర్వ్యూలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. కుప్పం(M)లో ఇంటర్వ్యూలకు కొందరు కలర్ జిరాక్స్ సర్టిఫికెట్లతో హాజరయ్యారు. వాటిని అధికారులు రిజెక్ట్ చేశారు. కొంతమంది National institute of Open Schoolలో 10th చదివినట్లు సర్టిఫికెట్లు చూపించి ఉద్యోగంలో చేరినట్లు తెలుస్తోంది. ఇలాంటి సర్టిఫికెట్లతో మరెంత మంది ఉద్యోగాల్లో చేరారన్నది చర్చనీయాంశంగా మారింది.
News February 17, 2026
ఇందాపూర్ సహా 4 డెయిరీలకు నెయ్యి ఆర్డర్లు: BR నాయుడు

AP: శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఆవు నెయ్యి కొనుగోలులో నాణ్యత, పారదర్శకతకు పెద్దపీట వేసినట్లు TTD ఛైర్మన్ BR నాయుడు వెల్లడించారు. ‘నెయ్యి నాణ్యత తగ్గకుండా సేకరణ పరిధిని 1,500KM నుంచి 800KMకు తగ్గించాం. ట్యాంకర్లకు GPS లాక్ సిస్టమ్ ఏర్పాటుచేశాం. అలాగే ఇందాపూర్ డెయిరీకి మాత్రమే ఆర్డర్లు ఇచ్చామనేది అవాస్తవం. ప్రమాణాలు పాటించిన నందిని, మదర్, సంగం డెయిరీలకూ ఆర్డర్లు ఇచ్చాం’ అని ట్వీట్ చేశారు.


