News March 24, 2025

NGKL: ఎస్ఎల్బీసీ ఘటన.. సీఎం ఆదేశాలు

image

ఎస్ఎల్బీసీ సొరంగంలో సహాయకచర్యలను వేగవంతం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్‌జీఆర్ఐ, జీఎస్ఐతో అధ్యయనం చేయించి, సొరంగంలో డ్రిల్, బ్లాస్ట్ విధానాన్ని ఉపయోగించాలనుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఆ ఏడుగురికి పరిహారం చెల్లింపుపై ఓ నిర్ణయానికి రానున్నట్లు పేర్కొన్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకెళ్తామని, తాత్కాలిక చర్యలే కాకుండా శాశ్వత చర్యలపై దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు.

Similar News

News April 1, 2025

విశాఖ వస్తున్న యుద్ధ నౌకలు

image

భారత్, అమెరికా సంయుక్తంగా విశాఖలో ఇవాళ్టి నుంచి టైగర్ ట్రయంఫ్ విన్యాసాలు చేయనున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం, విపత్తు నిర్వహణ తదితర అంశాల్లో పరస్పర సహకారంలో భాగంగా ఇరు దేశాలు ఈ విన్యాసాలు చేపడుతున్నాయి. 13 రోజుల పాటు బంగాళాఖాతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇప్పటికే 2 యుద్ధ నౌకలు విశాఖకు తరలివస్తున్నాయి. ఇరు దేశాల వైస్ అడ్మిరల్, రియల్ అడ్మిరల్ స్థాయిలో పరస్పర చర్చలు జరగనున్నాయి.

News April 1, 2025

ఆదిలాబాద్‌లో పెరిగిన చికెన్ ధరలు

image

పండగల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో చికెన్ విక్రయాలు భారీగా పెరిగాయి. దీంతోపాటు చికెన్ ధరలు సైతం పెరిగాయి. ఆదిలాబాద్ పట్టణంలో కిలో రూ:200, స్కిన్ లెస్ రూ:220 ధర పలుకుతుంది. కొన్నిచోట్ల డిమాండ్ ను బట్టి అమ్ముతున్నారు. గత నెలలో కిలో రూ.160 నుంచి 180 వరకు విక్రయాలు జరిపారు. గత రెండు నెలలుగా గిరాకి లేక ఇబ్బందులు పడ్డ వ్యాపారులకు.. తిరిగి చికెన్ విక్రయాలు ఊపందుకోవడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News April 1, 2025

హైదరాబాద్‌లో జర్మనీ యువతిపై గ్యాంగ్ రేప్

image

TG: హైదరాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. నగరంలోని పహాడీషరీఫ్‌ ప్రాంతంలో జర్మనీ దేశానికి చెందిన యువతిపై గ్యాంగ్ రేప్ జరిగింది. లిఫ్ట్ ఇస్తామని ఆమెను కారులో ఎక్కించుకున్న దుండగులు మార్గంమధ్యలో ఘాతుకానికి పాల్పడ్డారు. ఘటన అనంతరం పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేశారు. ఈ దారుణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!