News March 18, 2025
NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News March 19, 2025
మెదక్ యువతకు GOOD NEWS

రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మెదక్ జిల్లాలోని SC, ST, BC, మైనార్టీ నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి. జిల్లాలో 1.55 లక్షల మంది యువత ఉన్నారు. ఏప్రిల్ 5 వరకు http:///tgobmmsnew.cgg.gov.in లో అప్లై చేసుకుంటే జూన్ 2 అర్హుల తుది జాబితా ప్రకటిస్తారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలను త్వరలో వెల్లడించనున్నారు. ఎంచుకునే యూనిట్ని బట్టి రూ.3 లక్షల వరకు ఇవ్వనున్నారు.
News March 19, 2025
ప్రకాశం జిల్లా కలెక్టర్కు ‘స్కోచ్ అవార్డు’

ప్రకాశం జిల్లాలో బాల్య వివాహాలను నివారించి బంగారు బాల్యానికి బాటలు వేసేలా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన కలెక్టర్ అన్సారియాకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు లభించింది. బాల్య వివాహాల నివారణకై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలను, స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేస్తూ ‘బంగారు బాల్యం’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. త్వరలో ఢిల్లీలో జరిగే కార్యక్రమంలో అవార్డు అందుకుంటారు.
News March 19, 2025
BYD సంచలనం.. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే 470 కి.మీ

చైనాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ BYD సంచలనం సృష్టించింది. కేవలం 5-8 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అయ్యే టెక్నాలజీని అందుబాటులోకి తెచ్చింది. 5 నిమిషాలు ఛార్జ్ చేస్తే కారు దాదాపు 470 కి.మీ వెళ్తుందని ఆ కంపెనీ ప్రకటించింది. చైనావ్యాప్తంగా 4వేల అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించబోతున్నామని తెలిపింది. దీంతో టెస్లా, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలకు గట్టి సవాల్ ఎదురుకానుంది.