News March 18, 2025
NGKL: ఏడేళ్ల బాలికపై అత్యాచారం

ఏడేళ్ల బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాలు.. పదర మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికను తల్లిదండ్రులు సమీప బంధువు ఇంటి వద్ద విడిచి పనులమీద బయటికెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 14న బాలికపై ఓ ఆగంతకుడు అత్యాచారం చేశాడు. ఈ విషయాన్ని బాలిక ద్వారా తల్లిదండ్రులు తెలుసుకుని పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Similar News
News October 17, 2025
కరీంనగర్ కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ ఎన్నికల షెడ్యూలు జారీ

కరీంనగర్ కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ నూతన పాలక మండలి ఎన్నికలకు ఎన్నికల అధికారి, జగిత్యాల జిల్లా సహకార అధికారి మనోజ్ కుమార్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఈనెల 21 నుండి 23 వరకు కరీంనగర్ కోపరేటివ్ అర్బన్ బ్యాంక్ కేంద్ర కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. 24న నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణకు 25 వరకు గడువు ఉంటుందన్నారు. 25న గుర్తులు కేటాయించి నవంబర్ 1న పోలింగ్ అనంతరం కౌంటింగ్ ఉంటుందన్నారు.
News October 17, 2025
దమ్ముంటే కల్తీ మద్యంపై అఖిలపక్ష కమిటీ వేయండి: పేర్ని నాని

AP: తమ హయాంలోని QR కోడ్ పద్ధతిని కూటమి తొలగించి కల్తీ మద్యంతో భారీ ఎత్తున దోచుకుందని YCP నేత పేర్ని నాని దుయ్యబట్టారు. ‘ఈ ప్రభుత్వ బార్ పాలసీ వెనుక స్కామ్ ఉంది. నకిలీ మద్యం అమ్మకం కోసమే రూ.99 లిక్కర్ ఆపేశారు. రాష్ట్రంతో పాటు పక్క రాష్ట్రాల నుంచి కల్తీ మద్యం తెచ్చి అమ్మారు’ అని ఆరోపించారు. దీన్ని నిరూపించడానికి తాను సిద్ధమని, దమ్ముంటే అన్ని పార్టీల నేతలతో నిజనిర్ధారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.
News October 17, 2025
KMR: 1,579 ఫోన్లు రికవరీ

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీలో కామారెడ్డి జిల్లా పోలీసులు వేగంగా స్పందిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు సుమారు రూ.2.53 కోట్ల విలువైన 1,579 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశారు. మొబైల్ పోగొట్టుకున్న వారు ఆందోళన చెందకుండా వెంటనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని SP రాజేష్ చంద్ర సూచించారు. తిరిగి ఫోన్ పొందే అవకాశం ఉందన్నారు. ఫోన్లు రికవరీ చేసిన బృందాన్ని ఆయన అభినందించారు.