News April 25, 2024
NGKL: కాంగ్రెస్పై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడింది: కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ పై కేవలం వంద రోజుల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు.NGKL జిల్లా కేంద్రంలో ప్రసంగిస్తూ.. 6గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రజలను మోసంచేసి అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క పథకాన్ని కూడా పకడ్బందీగా అమలు చేయకుండా ప్రచారం చేసుకుంటున్నారే తప్ప క్షేత్రస్థాయిలో అవి అమలు కాకపోవడం లేదని ఆరోపించారు. మూడోసారి మోడీ ప్రధాని కావడం ఖాయం అన్నారు.
Similar News
News September 30, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్య వార్తలు.. !
✒దౌల్తాబాద్:అంత్యక్రియలకు వెళ్తూ ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి
✒ఉమ్మడి జిల్లాలో దసరా వేడుకలు షురూ
✒మెదక్ పై పాలమూరు ఘనవిజయం..ఇక సెమి ఫైనల్
✒GDWL: మహిళపై అత్యాచారయత్నం.. కేసు నమోదు
✒దోపిడీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలి:RS ప్రవీణ్
✒రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: డీకే అరుణ
✒DSC ఫలితాలు విడుదల..1:3 పై ఫోకస్
✒నల్లమలలో టైగర్ సఫారీ రెడీ.. ఇక ఆన్లైన్ బుకింగ్
News September 30, 2024
నిబంధనల మేరకు ధాన్యం కొనుగోలు చేయాలి: సిక్తా పట్నాయక్
ప్రభుత్వ నిబంధనలు అనుసరించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం నారాయణపేట శివారులోని వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రంలో సంబంధిత అధికారులు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో సన్న రకం వరి ధాన్యం మాత్రమే కొనుగోలు చేయాలని, దొడ్డు రకం వరి ధాన్యం కొనుగోలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News September 30, 2024
రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ తుంగలో తొక్కింది: డీకే అరుణ
హైదరాబాద్లోని ఇందిరాపార్క్ వద్ద నేడు బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన రైతుహామీల సాధనదీక్షలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. రైతు డిక్లరేషన్ను కాంగ్రెస్ తుంగలో తొక్కిందన్నారు. రైతురుణమాఫీపై సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు విరుద్ధ ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వడ్లకు బోనస్ ఇస్తామన్న హామీని కాంగ్రెస్ విస్మరించిందని విమర్శించారు.