News February 3, 2025

NGKL: కేంద్ర బడ్జెట్‌పై నేడు కాంగ్రెస్ నిరనలు

image

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నిరసనకు పిలుపునిచ్చింది. స్థానిక అంబేడ్కర్ విగ్రహం వద్ద మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు ధర్నా నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే, జిల్లా డీసీసీ వంశీకృష్ణ తెలిపారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్, NSUI, జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారని చెప్పారు.

Similar News

News January 21, 2026

HYD: ఈ నగరానికి ఏమైంది.. ఒకేరోజు 3 హత్యలు..?

image

వరుస హత్యలతో HYD హడలెత్తుతోంది. అక్రమ సంబంధాలు, గంజాయి మత్తు మానవత్వాన్ని దహించేస్తోంది. మంగళవారం జరిగిన 3 హత్యలు నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. జవహర్‌ నగర్‌లో గంజాయి మత్తులో కన్నతల్లినే కొడుకు కిరాతకంగా హతమార్చాడు. కూకట్‌పల్లిలో జల్సాలకు అడ్డొస్తున్నాడని భర్తను ఉరేసి ఉసురు తీసింది కసాయి భార్య. బోరబండలో భార్యపై అనుమానంతో రోకలి బండతో కొట్టి చంపాడో <<18912212>>దుర్మార్గపు భర్త.<<>> నేరచీకట్లలో నగరం కమ్ముకుపోతోంది.

News January 21, 2026

HYD: ఈ నగరానికి ఏమైంది.. ఒకేరోజు 3 హత్యలు..?

image

వరుస హత్యలతో HYD హడలెత్తుతోంది. అక్రమ సంబంధాలు, గంజాయి మత్తు మానవత్వాన్ని దహించేస్తోంది. మంగళవారం జరిగిన 3 హత్యలు నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. జవహర్‌ నగర్‌లో గంజాయి మత్తులో కన్నతల్లినే కొడుకు కిరాతకంగా హతమార్చాడు. కూకట్‌పల్లిలో జల్సాలకు అడ్డొస్తున్నాడని భర్తను ఉరేసి ఉసురు తీసింది కసాయి భార్య. బోరబండలో భార్యపై అనుమానంతో రోకలి బండతో కొట్టి చంపాడో <<18912212>>దుర్మార్గపు భర్త.<<>> నేరచీకట్లలో నగరం కమ్ముకుపోతోంది.

News January 21, 2026

TTD చరిత్రలో మొట్టమొదటిసారిగా.!

image

ఓ రిటైర్డ్ IAS అధికారిని TTD తొలిసారిగా జేఈవోగా నియమించడం చర్చనీయాంశమైంది. టీటీడీ జేఈవో(హెల్త్ అండ్ ఎడ్యుకేషన్)గా డాక్టర్ ఏ.శరత్ నియమితులైన విషయం తెలిసిందే. ఈయన 2005 బ్యాచ్‌ IAS అధికారి. రిటైర్డ్ అయిన వారి సేవలు కావాలంటే ప్రత్యేకాధికారిగా, సలహాదారులుగా, కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ కింద ఇప్పటి వరకు నియమిస్తున్నారు. అయితే నూతన జేఈవో నియామకంపై ఉద్యోగులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.