News March 26, 2025
NGKL: గణితం పరీక్షకు 25 మంది గైర్హాజరు

నాగర్ కర్నూల్ జిల్లావ్యాప్తంగా బుధవారం 10వ తరగతి పరీక్షల్లో భాగంగా గణితం పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. 10,560 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 10,535 మంది విద్యార్థులు మాత్రమే హాజరయ్యారని డీఈఓ రమేష్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అన్ని వసతులు కల్పించామని ఆయన పేర్కొన్నారు.
Similar News
News November 18, 2025
ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.
News November 18, 2025
ఆవు తొలిచూలు, బర్రె మలిచూలు

ఆవు మొదటిసారి(తొలిచూలు) ఈనేటప్పుడు సాధారణంగా ఎక్కువ పాలు ఇవ్వకపోవచ్చు లేదా దూడ బలంగా ఉండకపోవచ్చు. అంటే, ఏదైనా ఒక పని తొలి ప్రయత్నంలో ఆశించినంత మంచి ఫలితాలు రాకపోవచ్చు. అదే బర్రె రెండోసారి(మలిచూలు) లేదా ఆ తర్వాత ఈనేటప్పుడు దూడ ఆరోగ్యంగా ఉండటంతో పాటు పాలు ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే కొన్నిసార్లు తొలి ప్రయత్నం సరిగా లేకున్నా.. మలి ప్రయత్నం మెరుగైన ఫలితాలను ఇస్తుందని ఈ సామెత అర్థం.
News November 18, 2025
వి‘పత్తి’.. తగ్గిన దిగుబడి, పెరగని రేటు!

APలో ఇటీవల తుఫానుతో పత్తి పంట తీవ్రంగా దెబ్బతింది. దిగుబడి తగ్గడంతోపాటు నాణ్యతా లోపించింది. దీంతో మద్దతు ధర అందడం లేదు. MSP ₹7,710-8,110 ఉండగా, ₹7వేల లోపే ధర పలుకుతోంది. CCI కేంద్రాల్లో తేమ పరీక్షతో ధర తగ్గించడం, శ్లాబుల వల్ల ఎదురుచూడలేక ప్రైవేటు వ్యాపారులకు రైతులు అమ్ముతున్నారు. పెట్టుబడి ఖర్చులూ రావట్లేదని వాపోతున్నారు. అటు తెలంగాణలో జిన్నింగ్ మిల్లుల సమ్మెతో పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి.


