News March 10, 2025
NGKL: గురు ప్రీత్ సింగ్ కుటుంబ నేపథ్యం ఇదే..!

SLBC టన్నెల్ ప్రమాదంలో మృతి చెంది 16 రోజులకు మృతదేహంగా బయటపడిన గురు ప్రీత్ సింగ్(40) కుటుంబ నేపథ్యం ఇదే. వీరిది పంజాబ్లోని చీమ కలన్ గ్రామంలో 1985లో జన్మించారు. తండ్రి విర్స సింగ్, ఎరెక్టర్ ఆపరేటర్గా పనిచేసేవారు. అమెరికాకు చెందిన రాబిన్స్ కంపెనీలో 2022లో రెగ్యులర్ ఉద్యోగిగా చేరారు. భార్య రాజ్విందర్ కౌర్ ఉన్నారు. ఆయన మృతదేహం బయటకు తేవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగారు.
Similar News
News January 18, 2026
VJA: పెళ్లి సంబంధం ఇష్టంలేదని కాలువలో దూకేశాడు..!

పేరెంట్స్ చూసిన పెళ్లి సంబంధం నచ్చలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు కాలువలోకి దూకిన ఘటన కలకలం రేపింది. పటమట దర్శిపేటకు చెందిన యువకుడికి పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు ఈ నెల 16న పెళ్లి చూపులకు వెళ్లారు. అయితే ఆ సంబంధం ఇష్టం లేని యువకుడు.. శనివారం సాయంత్రం యనమలకుదురు పాత వంతెన వద్ద తన ఫోన్ పక్కన పడేసి కాలువలోకి దూకాడు. సమాచారం అందుకున్న NDRF బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇంకా ఆచూకీ తెలియలేదు.
News January 18, 2026
నేటి నుంచి నాగోబా జాతర

TG: దేశంలో రెండో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి చెందిన ఆదిలాబాద్(D) కేస్లాపూర్ నాగోబా జాతరకు సర్వం సిద్ధమైంది. పుష్యమాస అమావాస్య సందర్భంగా ఇవాళ 10pmకు మహాపూజలతో అంకురార్పణ చేయనున్నారు. మెస్రం వంశీయులు మంచిర్యాల(D)లోని హస్తిన మడుగు నుంచి కాలినడకన సేకరించిన గోదావరి జలంతో నాగోబాకు అభిషేకం చేసి, 7 రకాల నైవేద్యాలు సమర్పించడంతో జాతర ప్రారంభం అవుతుంది. 22న గిరిజన దర్బార్, 25వ తేదీతో జాతర ముగియనుంది.
News January 18, 2026
చిత్తూరు జిల్లాలో భారీగా మద్యం అమ్మకాలు

సంక్రాంతి పండుగ నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో రూ.15 కోట్లకు పైగా మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది కంటే ఇది 34% ఎక్కువ. సాధారణంగా జిల్లాలో రోజుకు రూ.కోటి వరకు మద్యం విక్రయాలు జరుగుతాయి. న్యూ ఇయర్ పురస్కరించుకొని రికార్డు స్థాయిలో రూ.14 కోట్ల మద్యం విక్రయాలు జరిగిన సంగతి తెలిసిందే. పండుగల వేళ భారీగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.


