News February 5, 2025

NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి

image

ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.

Similar News

News October 22, 2025

సిద్దిపేట: మద్యం మత్తులో తండ్రిని చంపాడు

image

మద్యం మత్తులో కుమారుడు తండ్రిని హత్య చేసిన ఘటన మేడ్చల్‌ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం అచయిపల్లికి చెందిన నిజాముద్దీన్‌ను తన కొడుకు సాతక్ హత్య చేశాడు. మద్యం మత్తులో వారిద్దరి మధ్య గొడవ జరగ్గా సాతక్ తుర్కపల్లి వాటర్ ప్లాంట్ వద్ద బండరాయితో కొట్టి నిజాముద్దీన్‌ను చంపేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి సాతక్‌తో పాటు అతడి స్నేహితుడు రాజును అరెస్టు చేశారు.

News October 22, 2025

పశువుల్లో గాలికుంటు వ్యాధి ఎలా వస్తుందంటే?

image

వైరస్ ద్వారా వ్యాపించే గాలి కుంటువ్యాధి పశువుల్లో ప్రమాదకరమైనది. వర్షాకాలంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. తడిగా ఉండే నేలపై గడ్డిమేయడం, కలుషితమైన మేత, దాణా తినడం వల్ల ఈ వైరస్ పశువులకు సోకుతుంది. ఇది అంటువ్యాధి. వైరస్, గాలి ద్వారా ఇతర పశువులకూ వ్యాపిస్తుంది. తల్లిపాల ద్వారా దూడలకు వస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఈ వ్యాధి పశువులకు వచ్చే అవకాశం ఎక్కువ.

News October 22, 2025

శివకాశి రికార్డు.. రూ.7వేల కోట్ల బిజినెస్

image

దేశ బాణసంచా రాజధాని శివకాశి(TN) రికార్డు సృష్టించింది. ఈ దీపావళి సీజన్లో రూ.7వేల కోట్ల బిజినెస్ జరిగిందని, 2024 కంటే రూ.1,000 కోట్లు అధికమని ఫైర్ వర్క్ ట్రేడర్స్ అసోసియేషన్ తెలిపింది. శివకాశిలో వేల సంఖ్యలో ఫ్యాక్టరీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే బాణసంచాలో 90% ఇక్కడి నుంచే సప్లై అవుతుంది. రిటైల్ మార్కెట్లో కంటే తక్కువ ధర ఉండటంతో ఇతర రాష్ట్రాల ప్రజలూ ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు.