News March 19, 2025

NGKL: చికిత్స పొందుతూ బాలిక మృతి

image

ఈనెల 15న ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన బాలిక చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల వివరాలు.. NGKL మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఎక్కువగా ఫోన్ చూస్తోందని తండ్రి మందలించటంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదైంది.

Similar News

News October 20, 2025

PHOTO: పార్వతీపురం బస్టాండ్‌లో పేలిన బ్యాగు ఇదే

image

పార్వతీపురం బస్టాండ్‌లోని ఆదివారం మందుగుండు సామాను పేలిన ఘటనలో అమాయకులు <<18052090>>ప్రాణాపాయస్థితి<<>>లోకి వెళ్లారు. విజయనగరం నుంచి సర్జికల్ వస్తువుల పేరుతో పార్శిల్ చేసిన బ్యాగులో మందుగుండు సామాన్లు పెట్టారు. ఆ బ్యాగు దించే సమయంలో పేలడంతో నలుగురు గాయపడ్డారు. పార్శిల్ కేంద్రంలో కంప్యూటర్, ప్రింటర్లు సైతం ధ్వంసం అయ్యారు. పార్శిల్ బుక్ చేసిన వ్యక్తి పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం.

News October 20, 2025

ఖేడ్‌లో 21న ఉమ్మడి జిల్లా రగ్బీ ఎంపికలు

image

ఉమ్మడి మెదక్ జిల్లా బాలబాలికల అండర్-19 రగ్బీ ఎంపికలు ఈనెల 21న నారాయణఖేడ్‌లోని తహశీల్దార్ మైదానంలో నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా ఇంటర్ అధికారి గోవిందారం తెలిపారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులని చెప్పారు. ఆసక్తిగల వారు బోనాఫైడ్, పదవ తరగతి మెమో, జనన ధ్రువీకరణ పత్రంతో ఉదయం 9 గంటలకు హాజరుకావాలని సూచించారు.

News October 20, 2025

సదర్ ఉత్సవాల్లో కిషన్‌రెడ్డి సందడి

image

TG: HYD కాచిగూడలోని చప్పల్ బజార్‌లో యాదవుల సదర్ ఉత్సవాల్లో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సందడి చేశారు. ‘ఆల్ ఇండియన్ ఛాంపియన్ బుల్స్’కు స్వాగతం పలికారు. యాదవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతిలో ప్రతి పండుగ పవిత్రమైనదని, దున్న రాజుల ప్రదర్శన అద్భుతమని కొనియాడారు. సమాజంలో ఐక్యత, సాంస్కృతిక గర్వాన్ని ఈ వేడుకలు ప్రదర్శిస్తాయన్నారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు.