News March 19, 2025
NGKL: చికిత్స పొందుతూ బాలిక మృతి

ఈనెల 15న ఇంట్లో పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన బాలిక చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన సోమవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసుల వివరాలు.. NGKL మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక ఎక్కువగా ఫోన్ చూస్తోందని తండ్రి మందలించటంతో ఆత్మహత్యకు పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News November 24, 2025
పార్వతీపురం: ‘నలుగురు కార్యదర్శులు సస్పెండ్’

కొమరాడలో సచివాలయంలో విధులు నిర్వహించిన నలుగురు కార్యదర్శులపై సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు ఇచ్చినట్లు ఎంపీడీవో రమేశ్ తెలిపారు. గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగం జరిగాయి అన్న అభియోగంపై గతంలో పనిచేసిన కార్యదర్శులు శ్రీనివాసరావు, వైకుంఠరావు, గణపతితోపాటు ప్రస్తుత కార్యదర్శి నాగరాజును కూడా సస్పెండ్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు.
News November 24, 2025
బాపట్ల హర్షవర్ధన్కు ఐదు పతకాలు

విశాఖలో ఈ నెల 22,23 తేదీల్లో రాష్ట్ర స్థాయి వింటర్ ఆక్వాటిక్ సబ్ జూనియర్, జూనియర్ ఈత పోటీలు జరిగాయి. ఇందులో బాపట్ల జిల్లాకు చెందిన బి.హర్షవర్ధన్ రాజు పాల్గొని ప్రతిభ చూపాడు. స్వర్ణం, రజతం, మూడు కాంస్యం మొత్తం ఐదు పతకాలను నెగ్గాడు. ఈ ప్రదర్శనతో వచ్చె నెల తెలంగాణలో జరగనున్న 36వ సౌత్జోన్ ఆక్వాటిక్ ఛాంపియన్ షిప్కు రాజు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. అసోసియేషన్ సభ్యులు యువకుడిని అభినందించారు.
News November 24, 2025
HYD సిటీ కంటే ‘సింగారం’ బెస్ట్

పట్నంలో ఇరుకు రహదారులు, ట్రాఫిక్తో ప్రజలు విసిగిపోతున్నారు. విశాల ప్రాంతమైన సిటీ శివారు ప్రతాపసింగారానికి షిఫ్ట్ అవుతున్నారు. పట్నానికి 10 కిలోమీటర్ల దూరం ఉండడంతో ఇక్కడ ఇళ్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇన్ఫోసిస్-ORR సమీపం కావడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు ప్రయాణ సౌలభ్యం పెరిగింది. ప్రభుత్వం ఇక్కడ ల్యాండ్ పూలింగ్ స్కీం కింద 130 ఎకరాలను సేకరించి అభివృద్ధి చేస్తుండడంతో డిమాండ్ పెరిగింది.


