News February 15, 2025

NGKL: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

ఈ నెల 12న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిని వ్యక్తి మృతిచెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. NGKL జిల్లా పెంట్లవెల్లికి చెందిన షాలు(45) అడ్డాకులలో ఉంటూ రాళ్లు కొడతూ జీవిస్తున్నారు. అడ్డాకుల వైపు నుంచి వచ్చిన పొక్లెయిన్ బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవీందర్(32) అక్కడికక్కడే మృతిచెందగా.. షాలుకు గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ షాలు శుక్రవారం మృతిచెందారు.

Similar News

News December 8, 2025

వాజేడు మండలంలో యాక్సిడెంట్.. ఒకరు మృతి

image

ములుగు జిల్లా వాజేడు మండలం పెద్దగొల్లగూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెరుకూరు మీదుగా వెళ్ళుతున్న మిని టాక్సీ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గొంది సాంబశివరావు (45) మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనాస్థలానికి వాజేడు ఎస్ఐ జక్కుల సతీష్ చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

News December 8, 2025

CHROME వాడుతున్నారా?.. యాపిల్ హెచ్చరిక

image

గూగుల్ క్రోమ్ వాడే ఐఫోన్ యూజర్లను యాపిల్ సంస్థ హెచ్చరించింది. Chrome బ్రౌజర్ ‘డివైజ్ ఫింగర్‌ప్రింటింగ్’ అనే రహస్య ట్రాకింగ్ పద్ధతి ద్వారా యూజర్ల కార్యకలాపాలను ట్రాక్ చేస్తుందని పేర్కొంది. దీనిని ఆఫ్ చేసే అవకాశం యూజర్లకు లేదని తెలిపింది. అలాగే Safariలో ‘Try App’ లింక్‌లను నొక్కితే Google App ఓపెన్ అవుతోందని తద్వారా మరింత డేటాను సేకరిస్తుందని అభిప్రాయపడింది. Safari బ్రౌజర్ సేఫ్ అని స్పష్టం చేసింది.

News December 8, 2025

నెల్లూరు: విష జ్వరాలపై కలెక్టర్ అత్యవసర సమావేశం

image

జిల్లాలో విష జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో కలెక్టర్ హిమాన్షు శుక్ల అత్యవసర సమావేశాన్ని వైద్య ఆరోగ్యశాఖ, GGH వైద్యులతో నిర్వహించారు. బుచ్చి, రాపూరు ప్రాంతాల్లో స్క్రబ్ టైపస్ లక్షణాలతో ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ ధ్రువీకరించనప్పటికీ లోపల మాత్రం దీనిపై పునరాలోచనలు జరుగుతున్నాయి. మరోవైపు ఈ కేసులు పెరిగితే తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ చర్చినట్లు తెలిసింది.