News February 7, 2025

NGKL: చెరువులో పడి మహిళ మృతి

image

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం సమీపంలోని శ్రీరంగాపురం చెరువులో మునిగి మహిళ మృతి చెందిన ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. దాదాపు 35 ఏళ్ల వయసున్న మహిళ చెరువులో మునిగి చనిపోయినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. చనిపోయిన మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 9, 2026

జిల్లాలో పెరుగుతున్న చలి.. తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

image

కామారెడ్డి జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను అధికారులు వెల్లడించారు. కనిష్టంగా మేనూర్ 12.3°C, లచ్చపేట 12.4, జుక్కల్ 12.6, డోంగ్లి 13, బొమ్మన్ దేవిపల్లి, సర్వాపూర్ 13.2, ఎల్పుగొండ, నస్రుల్లాబాద్ 13.5, పెద్దకొడప్గల్ 13.7, గాంధారి 13.8, బిచ్కుంద 14, దోమకొండ 14.2, పుల్కల్ 14.3, ఇసాయిపేట, బీర్కూర్ 14.4 రామలక్ష్మణపల్లి 14.5, మచాపూర్, నాగిరెడ్డిపేట్, రామారెడ్డి 14.7°C లుగా నమోదయ్యాయి.

News February 9, 2026

ఆదిలాబాద్: ప్రచారానికి ముఖ్యనేతలేవరు రాలే..!

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ప్రచార పర్వం నేటితో ముగియనుంది. కాసేపట్లో మైకులు మూగబోనున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రధాన పార్టీల ముఖ్యనేతలు ఎవరుకుడా ప్రచారానికి రాలేదు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ మాత్రమే జిల్లా కేంద్రంలో పర్యటించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, అటు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ప్రచారానికి వస్తారనే ప్రచారం సాగినప్పటికీ వారి పర్యటనపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత లేదు.

News February 9, 2026

కరీంనగర్: కులం.. గుణం.. ఓటు ఎటు?

image

ఉమ్మడి KNR జిల్లాలో మున్సిపాలిటీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరింది. ప్రచారానికి గడువు ముగుస్తుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. అభివృద్ధి, సంక్షేమం వంటి నినాదాలు పైకి వినిపిస్తున్నా, లోలోపల మాత్రం కులాల వారీగా ఓట్ల లెక్కలు అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేలా కనిపిస్తున్నాయి. చివరకు అభివృద్ధి మంత్రం గెలుస్తుందా? లేక సామాజిక వర్గాల సమీకరణాలు గట్టెక్కిస్తాయా? చూడాలి.