News March 9, 2025

NGKL: జాతరకు తీసుకెళ్లలేదని ఆత్మహత్య.!

image

జాతరకు తీసుకెళ్లడం లేదని ఓ చిన్నారి మనస్తాపంతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKL జిల్లాలో జరిగింది. 9ఏళ్ల బాలుడు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, తాతయ్యల వద్ద ఉంటున్నాడు. వెల్దండ మండలంలో ఉన్న గుండాల శ్రీఅంబాల రామలింగేశ్వర స్వామి జాతరకు తీసుకెళ్లాలని పట్టుబట్టాడు. వారు వద్దనడంతో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

Similar News

News December 7, 2025

55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేసిన మంత్రి కొండపల్లి

image

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడి కార్పొరేషన్ మండలి (COSIDICI) ఆధ్వర్యంలో శనివారం విశాఖలో జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన 55 మంది పారిశ్రామికవేత్తలకు అవార్డులు అందజేశారు. ఇందులో రాష్ట్ర ఆర్థిక సంస్థ ద్వారా రుణాలు పొందిన 16 మంది పారిశ్రామికవేత్తలకు జాతీయ గౌరవ పురస్కారాలు లభించాయని మంత్రి తెలిపారు.

News December 7, 2025

మెదక్: పల్లెపోరు.. అభ్యర్థుల ఫీట్లు

image

తూప్రాన్ మండలం ఇస్లాంపూర్ సర్పంచ్ అభ్యర్థి భీములు మాజీ మంత్రి హరీశ్ రావును కలిశారు. బీఆర్ఎస్ మద్దతుతో పోటీ చేసిన సంతోష్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దాంతో బీఆర్ఎస్ నాయకులు పోటీలో నిలిచిన భీములుకు మద్దతు ప్రకటించారు. బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణగౌడ్ భీములును నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి వద్దకు తీసుకెళ్లగా అక్కడి నుంచి వెళ్లి హరీశ్ రావును కలిశారు.

News December 7, 2025

నెల్లూరు: సిమ్ కార్డుతో మోసాలు

image

ఇతరుల వద్ద ఫోన్ తీసుకొని సిమ్ కార్డులను మారుస్తూ, ఓటీపీల సాయంతో నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు చీమకుర్తి సీఐ ప్రసాద్ తెలిపారు. గతనెల 29న అందిన ఫిర్యాదు మేరకు SP హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో దర్యాప్తు సాగిందన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన శేషయ్య ఓటీపీల సహాయంతో వచ్చిన డబ్బులను బెట్టింగ్ యాప్‌లకు వాడినట్లు గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ఇతని వద్ద రూ.2,60,000 రికవరీ చేసినట్లు తెలిపారు.