News January 31, 2025
NGKL జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో మంత్రి జూపల్లి సమీక్ష

నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధిపై హైదరాబాద్లోని సచివాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎంపీ మల్లురవి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తదితర శాఖల అధికారులతో చర్చించారు.
Similar News
News November 2, 2025
GWL: ఇసుక క్వారీలపై నివేదిక సిద్ధం చేయాలి: కలెక్టర్

జోగులాంబ గద్వాల జిల్లాలోని చిన్న తరహా ఖనిజాలు, ఇసుక క్వారీలపై పూర్తిస్థాయి నివేదిక తయారు చేయాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం తన ఛాంబర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. నీటిపారుదల, భూగర్భ జల, గనులు మరియు భూగర్భ శాఖ, టీఎస్ఎండీసీ, అటవీ, రెవెన్యూ విభాగాల అధికారులు ఈ నివేదికలను సిద్ధం చేసి, ఆయా శాఖల కార్యాలయాల్లో సమర్పించాలని సూచించారు.
News November 2, 2025
ఉగ్రవాదులను తుడిచిపెట్టేస్తాం: ట్రంప్

నైజీరియాలో క్రైస్తవుల హత్యలు ఆగకపోతే అన్ని సహాయ సహకారాలు ఆపేస్తామని US అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ‘ఆ దేశంలోకి చొచ్చుకెళ్లి ఇస్లామిక్ ఉగ్రవాదులను పూర్తిగా నాశనం చేయొచ్చు. తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మా యుద్ధ విభాగాన్ని ఆదేశిస్తున్నా. క్రైస్తవులపై ఉగ్రవాదులు దాడి చేసినట్లుగానే మా దాడి వేగంగా, దారుణంగా, మధురంగా ఉంటుంది. నైజీరియా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకోవాలి’ అని హెచ్చరించారు.
News November 2, 2025
గోరంట్ల బ్రిడ్జిపై తేలిన ఇనుప కడ్డీలు

గోరంట్ల సమీపంలోని బ్రిడ్జిపై ఇనుప కడ్డీలు తేలడంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రిడ్జి ప్రారంభించిన రెండు మూడేళ్లకే ఇనుప కడ్డీలు తేలడంతో సంబంధిత గుత్తేదారు పనులు నాసిరకంగా చేశారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీనిపై మంత్రి సవిత దృష్టి సారించాలని పలువురు పేర్కొంటున్నారు. తాత్కాలికంగా అపాయకరంగా మారిన ఇనుప కడ్డీలను తొలగించడమో, వాటిపై కాంక్రీట్ వేయడమో చేయాల్సిన అవసరం ఉందంటున్నారు.


