News January 31, 2025
NGKL జిల్లా అభివృద్ధిపై ఎమ్మెల్యేలతో మంత్రి జూపల్లి సమీక్ష

నాగర్ కర్నూల్ జిల్లా అభివృద్ధిపై హైదరాబాద్లోని సచివాలయంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, ఎంపీ మల్లురవి, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ తదితర శాఖల అధికారులతో చర్చించారు.
Similar News
News February 13, 2025
కేటిదొడ్డి: కర్ణాటక-తెలంగాణ సరిహద్దులో తనిఖీలు

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. కర్ణాటక – తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో తనిఖీలు ముమ్మరం చేశారు. కేటిదొడ్డి మండలం నందిన్నె చెక్ పోస్టు వద్ద వెటర్నరీ అధికారి డాక్టర్ నవీన్ చంద్ర, ఎక్సైజ్ కానిస్టేబుల్ జగదీష్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. కర్ణాటక నుంచి సరఫరా అయ్యే కోళ్లకు సంబంధించి వాహనాలను తనిఖీ చేశారు.
News February 13, 2025
NZB: 70 శాతం సీసీ కెమెరాలు పనిచేయడం లేదు: కవిత

భద్రత కోసం మహిళలు పోరాటం చేయాల్సిరావడం బాధాకరమని జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన మహిళా జాగృతి సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. ఆడపిల్ల కాలేజీకి వెళ్తే ఇంటికొచ్చే వరకు ఎదురుచూసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు 70 శాతం పనిచేయడం లేదని ఆరోపించారు.
News February 13, 2025
వనపర్తి: ‘వెట్టి చాకిరి నుంచి విముక్తి కల్పించాలి’

బాలలను వెట్టిచాకిరి నుంచి విముక్తి కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలపై ఉందని వనపర్తి జిల్లాన్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని అన్నారు. బాలల బెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా కోర్టు ఆవరణలో అంతర్జాతీయ న్యాయమిషన్ వారు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. రజిని మాట్లాడుతూ.. బాండడ్ లేబర్కు వ్యతిరేకంగా ఈమాసంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.