News March 26, 2025

NGKL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం, ఏసీలు దగ్ధం

image

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని పలు ఏసీలు అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. దీంతో సుమారు రెండు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. అగ్ని ప్రమాదం సంభవించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పి వేసినట్లు జిల్లా ఫైర్ అధికారి కృష్ణమూర్తి తెలిపారు.

Similar News

News December 8, 2025

సంగారెడ్డి: అనుమానాస్పదస్థితిలో ప్రభుత్వ టీచర్ భార్య మృతి

image

కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో నివాసముంటున్న సుచిత ఆదివారం అనుమానస్పదంగా మృతి చెందింది. ప్రభుత్వ టీచర్ శ్రీనివాస్ తన భార్య గుండెపోటుతో మరణించిందని బంధువులను నమ్మించాడు. మాధ్వార్‌లో అంత్యక్రియల సమయంలో గొంతు వద్ద మరకలు చూసి సుచిత బంధువులు అంత్యక్రియలు నిలిపివేశారు. కొండాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

News December 8, 2025

సమస్యల పరిష్కారానికి ఏలూరు సబ్‌కలెక్టర్ సూచనలు

image

నూజివీడులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న జిల్లా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు అందించే అర్జీలను ఆన్లైన్ చేయాలన్నారు. ప్రతి సమస్యను నిర్ణీత వ్యవధిలో పరిష్కరించాలన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రజల నుంచి తీసుకున్న ప్రతి అర్జీని పరిశీలించి పరిష్కరించాలన్నారు.

News December 8, 2025

కల్వకుర్తి: 40 తులాల బంగారు ఆభరణాలు దొంగతనం

image

కల్వకుర్తి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో భారీ చోరీ జరిగింది. కాలనీకి చెందిన పూజారి శ్రీనివాస శర్మ ఇంట్లో దొంగలు దోపిడీకి పాల్పడి 40 తులాల బంగారు ఆభరణాలతో పాటు ఆరు లక్షల నగదు చోరీకి గురైనట్లు బాధితుడు తెలిపారు. ఈనెల 30న కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వెళ్లిన ఆయన సోమవారం ఉదయం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా ధ్వంసం చేసి అందులో ఉన్న నగదు, బంగారు ఆభరణాలు దొంగిలించారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.