News March 30, 2025
NGKL: జిల్లా ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు: కలెక్టర్

తెలుగు నూతన సంవత్సరాది శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ… ఆదివారం తెలుగు నూతన సంవత్సరం ఉగాది పండగను ప్రజలు ఆనందోత్సాహాలతో, సుఖసంతోషాలతో మధ్య నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం అందరికీ శుభవార్తలు, విజయాలను తీసుకురావాలన్నారు.
Similar News
News November 14, 2025
BREAKING: శంషాబాద్ విమానాశ్రయంలో FULL EMERGENCY ప్రకటన

లండన్ నుంచి HYD వచ్చే BA 277 (STA 05:20) విమానానికి బాంబ్ బెదిరింపు కారణంగా ఈరోజు ఉదయం 4:46 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ ప్రకటించారు. 5:10 గంటలకు 167 మంది ప్రయాణికులు, ఇద్దరు శిశువులు, ఇద్దరు కాక్పిట్ సిబ్బంది, 8 కేబిన్ సిబ్బందితో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానాన్ని ప్రస్తుతం ఐసోలేషన్ బేకు తరలించి తనిఖీ చేస్తున్నారు.
News November 14, 2025
రాజుపేట అబ్బాయికి దక్షిణ కొరియా అమ్మాయితో పెళ్లి

వీఆర్ పురం మండలం రాజుపేట కాలనీకి చెందిన నాగేంద్ర ప్రసాద్ దక్షిణ కొరియాకు చెందిన MIN.KYONGతో వివాహం జరిగిందని కుటుంబ సభ్యులు గురువారం మీడియాకు తెలిపారు. అక్కడే సాఫ్ట్ వెర్ జాబ్ చేస్తున్న నాగేంద్ర ప్రసాద్కు పరిచయమైన ఆమెను సీయోల్లో బౌద్ధ మత ఆచార పద్ధతి లో వివాహం చేసుకున్నాడని తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో వివాహం జరిగిందన్నారు. పలువురు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు.
News November 14, 2025
MBNR: నెట్బాల్ ఎంపికలకు 200 మంది

MBNR స్పోర్ట్స్ అథారిటీ ఇండోర్ స్టేడియంలో బుధవారం ఉమ్మడి జిల్లాకు చెందిన అండర్-14, 17, 19 బాల బాలికలకు నెట్బాల్ జట్ల ఎంపికలు నిర్వహించారు. జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ట్రయల్స్కు 200 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 15 నుంచి 17 వరకు మహబూబాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి నెట్బాల్ టోర్నీలో పాల్గొంటారని జిల్లా కార్యదర్శి డా.ఆర్.శారదాబాయి తెలిపారు.


