News February 22, 2025
NGKL: జిల్లా వాహనదారులకు ఎస్పీ హెచ్చరిక

జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేటి నుంచి స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ తెలిపారు. మైనర్లు వాహనాలు నడపడం, మద్యం తాగి వాహనాలు నడపడం, నంబర్ ప్లేట్లు లేని వాహనాలను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్,ఫోర్ వీలర్స్ వాహనదారులు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని సూచించారు.
Similar News
News November 23, 2025
సిరిసిల్ల: విధేయతకు పట్టం కట్టిన కాంగ్రెస్ అధిష్ఠానం

1982లో యూత్ కాంగ్రెస్లో చేరిన సంగీతం శ్రీనివాస్ 44ఏళ్ల నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. సిరిసిల్ల పట్టణానికి చెందిన ఈయన ఉమ్మడి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, OBC రాష్ట్ర కమిటీ, PCC సభ్యుడిగా పని చేశారు. సిరిసిల్ల మార్కెట్ కమిటి ఛైర్మన్గా సేవలందించారు. 10 సంవత్సరాలు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసి, రాజన్న సిరిసిల్ల DCC అధ్యక్షుడు అయ్యారు.
News November 23, 2025
MBNR: సైబర్ మోసాలు.. నిందితులు వీరే..!

సైబర్ మోసాలకు పాల్పడుతున్న ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్టు మహబూబ్ నగర్ ఎస్పీ డి.జానకి తెలిపారు.1.జర్పుల సురేందర్,2.కాట్రావత్ హనుమంతు,3.వడ్త్యా రాజు,4.వత్య భాస్కర్,5.కాట్రావత్ నరేష్,6.రాత్లావత్ సంతోష్,7.రాత్లావత్ సోమల వీరంతా తువ్వగడ్డ తండా, జై నల్లిపూర్ గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. MBNR, WNP టీమ్ల సహకారంతో లొకేషన్ ట్రాక్ చేసి అరెస్టు చేశారు. విచారణ అనంతరం జుడిషియల్ రిమాండ్కు పంపారు.
News November 23, 2025
ప్రకాశంలో కలవనున్న ఆ నియోజకవర్గాలు.!

ప్రకాశం ప్రజల కోరిక నెరవేరే టైం దగ్గరపడింది. అటు మార్కాపురం జిల్లా కావాలన్నది 40 ఏళ్ల కల. ఇటు విడిపోయిన అద్దంకి, కందుకూరు కలవాలన్నది మూడేళ్ల కల. 2022లో జిల్లాల విభజన సమయంలో అద్దంకి, కందుకూరు ప్రజలు తమను ప్రకాశం జిల్లాలో ఉంచాలని పట్టుబట్టారు. కానీ బాపట్ల వైపు అద్దంకి, నెల్లూరు వైపు కందుకూరు వెళ్లాయి. మార్కాపురం జిల్లా ఏర్పాటు సన్నాహాల నేపథ్యంలో మళ్లీ ఇవి ప్రకాశం వైపు రానున్నాయి.


