News January 26, 2025

NGKL: టీచర్‌ను సస్పెండ్ చేసిన డీఈవో

image

నాగర్ కర్నూల్ జిల్లా బాల్మురు మండలంలోని కొండానాగుల గ్రామంలోని జడ్పీ పాఠశాలలో విద్యార్థులపై చెప్పులతో దాడి చేసిన ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ డీఈవో రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాల ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామని తెలిపారు. విద్యార్థులపై దాడి ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది.

Similar News

News October 15, 2025

తాడికొండ: బాలికను గర్భవతిని చేసిన యువకుడిపై కేసు

image

తాడికొండ మండలంలో 17 ఏళ్ల బాలికను ప్రేమ పేరుతో మోసం చేసి గర్భవతిని చేసిన యువకుడిపై కేసు నమోదైంది. పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన వంశీ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికకు పరిచయమయ్యాడు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి ఆమె గర్భవతి కావడానికి కారణమయ్యాడు. ఆ తర్వాత ముఖం చాటేయడంతో బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 15, 2025

సత్తెనపల్లి: విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించిన టీచర్ సస్పెండ్

image

సత్తెనపల్లి మండలంలోని ఫణిదం గ్రామంలో విద్యార్థినితో అనుచితంగా ప్రవర్తించిన జెడ్పీ హైస్కూల్ ఉపాధ్యాయుడు జరార్డ్ బాబుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఘటనపై తల్లిదండ్రులు, మహిళలు ఆగ్రహంతో ఉపాధ్యాయుడిని చితకబాదగా, గ్రామ పెద్దలు ఇటువంటి ఘటనలు మళ్లీ జరగరాదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై స్పందించిన డీఈఓ చంద్రకళ ఉపాధ్యాయుడు జరార్డ్ బాబును సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.

News October 15, 2025

సికింద్రాబాద్: సంతోషం.. ఇప్పటికైనా మేల్కొన్నారు!

image

రైళ్లల్లో రోజూ వేల మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నారు. ఇది రైల్వే అధికారులకూ తెలుసు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక వ్యవస్థా ఉంది. అయితే ఎందుకో రైల్వే అధికారులు అసలు టికెట్ చెకింగ్ అనేదే చేయడం లేదని తెలుస్తోంది. ఇప్పటికైనా మేల్కొన్న అధికారులు తనిఖీలు చేయాలని నిర్ణయించి ఒక్కరోజు (మంగళవారం)లోనే రూ.కోటి పాయలు వసూలు చేశారు. ముందు నుంచే ఈ పని చేసి ఉంటే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు.