News April 5, 2025

NGKL: డిగ్రీ విద్యార్థి SUICIDE

image

బల్మూర్ మండలంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. తుమ్మెన్‌పేటకు చెందిన అరవింద్(20) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వారం రోజుల క్రితం ఉగాదికి ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 7, 2025

ఆ స్కూళ్లల్లో 40లోపే విద్యార్థులు.. త్వరలో టీచర్ల సర్దుబాటు!

image

AP: విద్యార్థుల సంఖ్య 40లోపు ఉన్న ఎయిడెడ్ స్కూళ్లు రాష్ట్రంలో 251 ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా ప్రకాశంలో 35, గుంటూరులో 29, బాపట్ల 26, కడప 18 స్కూళ్లు, అత్యల్పంగా అనకాపల్లి, కర్నూలులో 2 చొప్పున ఉన్నాయి. ఈ స్కూళ్లకు నోటీసులు జారీ చేయాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. ఈ పాఠశాలల్లో పని చేసే మిగులు ఉపాధ్యాయులను ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేయనున్నారు.

News October 7, 2025

‘భక్తి’ ఎంత గొప్పదో కదా!

image

ఆహారంలో భక్తి ప్రవేశిస్తే.. ప్రసాదమవుతుంది.
ఆకలికి భక్తి తోడైతే.. ఉపవాసమవుతుంది.
నీటిలో భక్తి ప్రవేశిస్తే.. తీర్థమవుతుంది.
యాత్రకి భక్తి తోడైతే.. తీర్థయాత్ర అవుతుంది.
సంగీతానికి భక్తి కలిస్తే.. కీర్తనమవుతుంది.
గృహంలో భక్తి ప్రవేశిస్తే.. దేవాలయం అవుతుంది.
పనిలో భక్తి ఉంటే.. పుణ్యకర్మ అవుతుంది.
సహాయంలో భక్తి ప్రవేశిస్తే.. సేవ అవుతుంది.

News October 7, 2025

NZB జిల్లాలో 33 సైబర్ కేసులు నమోదు: CP

image

నిజామాబాద్ CCSలో ఈ ఏడాది మార్చి నుంచి సెప్టెంబర్ వరకు మొత్తం 33 సైబర్ కేసులు నమోదు అయ్యాయని పోలీస్ కమీషనర్ సాయి చైతన్య సోమవారం తెలిపారు. బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్ ఫ్రాడ్, సైబర్ స్లేవ్వరీ తదితర కేసుల్లో 4,92,54,875 రూపాయలు పోగొట్టుకోగా రూ.87,29,839 రికవరీ అయ్యాయన్నారు. కాగా ప్రభుత్వం ద్వారా గుర్తించబడిన వాటిని మాత్రమే నమ్మే విధంగా ఉండాలని ప్రజలకు సీపీ సూచించారు.