News April 5, 2025
NGKL: డిగ్రీ విద్యార్థి SUICIDE

బల్మూర్ మండలంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. తుమ్మెన్పేటకు చెందిన అరవింద్(20) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వారం రోజుల క్రితం ఉగాదికి ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 11, 2025
సంగారెడ్డి: గిరిజన లా కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

సంగారెడ్డిలోని గిరిజన గురుకుల లా కళాశాలలో ప్రవేశాలకు ఈ నెల 13, 14న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ శుక్రవారం తెలిపారు. ఇంటర్ పాసైన, లాసెట్-2025లో అర్హత పొందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశంలో ఉన్న ఏకైక గిరిజన(Boys) గురుకుల న్యాయ కళాశాల ఇది. ఇక్కడ చేరితే 5 ఏళ్ల లా కోర్సును ఉచితంగా పూర్తి చేయవచ్చని అన్నారు.
-SHARE IT
News October 11, 2025
కుప్పంలో పరిశ్రమకు ప్రధాని మోదీ శంకుస్థాపన

కుప్పంలో శ్రీజ మహిళా పాల ఉత్పత్తి సంస్థ ఇంటిగ్రేటెడ్ డైరీ, పశువుల దానా ప్లాంట్ ఏర్పాటుకు శనివారం PM నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. గుడిపల్లి(M) పొగురుపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో సుమారు 45 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఏర్పాటు కానున్న ఈ పరిశ్రమకు సంబంధించి ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు సమక్షంలో పరిశ్రమ యాజమాన్యం MOU చేసుకున్నారు.
News October 11, 2025
డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు

AP: విజయనగరంలోని జనరల్ హాస్పిటల్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 10 డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులను భర్తీ చేయనుంది. డిగ్రీ, PGDCA అర్హతగల అభ్యర్థులు ఈ నెల 13న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. డిగ్రీ, పీజీడీసీఏలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.12వేలు గౌరవ వేతనం చెల్లిస్తారు. వెబ్సైట్: https://vizianagaram.ap.gov.in/