News April 5, 2025
NGKL: డిగ్రీ విద్యార్థి SUICIDE

బల్మూర్ మండలంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. తుమ్మెన్పేటకు చెందిన అరవింద్(20) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వారం రోజుల క్రితం ఉగాదికి ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 12, 2025
VZM: రూ.100 కోసం గొడవ.. వ్యక్తి మృతి

కొత్తవలసలో ఈనెల 7న రూ.100 కోసం ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ మరణానికి దారితీసింది. మంగళవీధికి చెందిన జే. ప్రసాద్(32) నుంచి మద్యం మత్తులో అదే వీధికి చెందిన ఎస్.రవితేజ రూ.100 లాక్కొని చికెన్ కొన్నాడు. చికెన్ లాక్కున్నాడని కూరగాయల కత్తితో ప్రసాద్ దవడపై రవితేజ పొడిచాడు. KGHలో చికిత్స పొందుతూ ప్రసాదు శనివారం మృతి చెందాడు. హత్యా నేరం కింద రవితేజను పోలీసులు అరెస్టు చేశారు.
News October 12, 2025
రాయవరం ఘటనలో పదికి చేరిన మృతుల సంఖ్య

రాయవరంలోని శ్రీ గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రంలో జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఆదివారం ఉదయం అనపర్తికి చెందిన చిట్టూరి యామిని చికిత్స పొందుతూ మరణించగా, తాజాగా వేండ్ర గ్రామానికి చెందిన లింగం వెంకటకృష్ణ కూడా మృతి చెందారు. దీంతో ఈ ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య పదికి చేరుకుంది. మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
News October 12, 2025
వికారాబాద్: డీసీసీ రేస్లో సుధాకర్ రెడ్డి..?

జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ)లకు నూతన అధ్యక్షులను నియమించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించిన నేపథ్యంలో జిల్లా అధ్యక్ష పదవి రేస్లో వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అర్ధ సుధాకర్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. దాదాపు పది సంవత్సరాలపాటు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న సుధాకర్ రెడ్డి 2023 సాధారణ ఎన్నికల్లో గడ్డం ప్రసాద్ కుమార్ విజయం సాధించడంలో ముఖ్యపాత్ర పోషించారు. దీనిపై మీ కామెంట్?