News April 5, 2025
NGKL: డిగ్రీ విద్యార్థి SUICIDE

బల్మూర్ మండలంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. తుమ్మెన్పేటకు చెందిన అరవింద్(20) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వారం రోజుల క్రితం ఉగాదికి ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 13, 2025
నంద్యాలలో నేడు ఎస్పీ PGRS రద్దు

నంద్యాల జిల్లాలోని SP కార్యాలయంలో సోమవారం జరగవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు SP సునీల్ షెరాన్ తెలిపారు. అనివార్య కారణాలవల్ల తాత్కాలికంగా కార్యక్రమాన్ని వాయిదా వేయడం జరిగిందని అన్నారు. కాబట్టి ప్రజలు ఎవరూ జిల్లా కేంద్రానికి రావద్దని సూచించారు. అక్టోబర్ 20వ తేదీన తిరిగి PGRSను యధావిధిగా కొనసాగిస్తామని ఆయన అన్నారు.
News October 13, 2025
వేణు ‘ఎల్లమ్మ’ ప్రాజెక్ట్ నుంచి నితిన్ ఔట్?

బలగం మూవీతో డైరెక్టర్గా బ్లాక్ బస్టర్ అందుకున్న వేణు తర్వాత ‘ఎల్లమ్మ’ చేయనున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో ఇంకా హీరో ఫైనల్ కాలేదని తెలుస్తోంది. మొదట నితిన్ పేరు వినిపించింది. నిర్మాత దిల్ రాజు కూడా ఆ విషయాన్ని కన్ఫామ్ చేశారు. కానీ, ఇప్పుడు నితిన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. ఈ కథను బెల్లంకొండ సాయి శ్రీనివాస్కు వినిపించగా ఓకే చేశారని సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి.
News October 13, 2025
మల్యాల: సంతానం లేదనే బాధతో.. వ్యక్తి ఆత్మహత్య

మల్యాల మండలం మద్దుట్ల గ్రామానికి చెందిన ఉప్పు శంకర్(43) శనివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఆరేళ్ల క్రితం వివాహమైనా పిల్లలు లేరనే బాధతో శంకర్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలోనే ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని భార్య శిరీష పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.