News April 5, 2025
NGKL: డిగ్రీ విద్యార్థి SUICIDE

బల్మూర్ మండలంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. తుమ్మెన్పేటకు చెందిన అరవింద్(20) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వారం రోజుల క్రితం ఉగాదికి ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 13, 2025
NLG: చేప పిల్లలు.. చెరువుకు చేరేదెప్పుడో!

అదును దాటుతున్నా టెండర్ల నిర్వహణ పూర్తి కాకపోవడంతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం ఆలస్యం అవుతుంది. ఫలితంగా జిల్లాలోని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటా ఈ సమయానికే చెరువులో చేప పిల్లలు వదిలే కార్యక్రమం పూర్తయ్యేది. జిల్లాలోని 1150 చెరువులు, కుంటలు, జలాశయాల్లో ఈ ఏడాది చేప పిల్లల సరఫరా కోసం ప్రభుత్వం టెండర్లు పిలిచి నెల రోజులు అవుతున్నా నేటికీ అవి తెరుచుకోలేదు.
News October 13, 2025
మంచిర్యాల: వివాహిత సూసైడ్

జీవితం విరక్తి చెంది వివాహిత ఆత్మహత్య చేసుకున్న హాజీపూర్ PS పరిధిలోని నర్సింగాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. ఎస్సై స్వరూప్రాజ్ ప్రకారం.. గ్రామానికి చెందిన వెంకటేశ్-వాణి దంపతులు. వెంకటేశ్ మెకానిక్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి వాణి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News October 13, 2025
శ్రీశైలానికి కొనసాగుతున్న వరద నీరు..

కృష్ణానది పరివాహక ప్రాంతాల నుండి శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది.
సోమవారం ఉదయం 6 గంటలకు వివరాలు ఇలా..
◆ ఇన్ ఫ్లో : 60,940 క్యూసెక్కులు (జూరాల, సుంకేసుల ప్రాజెక్టుల ద్వారా)
◆ అవుట్ ఫ్లో : 65,560 క్యూసెక్కులు (కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
◆ ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 884.40 అడుగులు
◆ నీటి నిల్వ: 212.4385 టీఎంసీలు