News April 5, 2025

NGKL: డిగ్రీ విద్యార్థి SUICIDE

image

బల్మూర్ మండలంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. తుమ్మెన్‌పేటకు చెందిన అరవింద్(20) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వారం రోజుల క్రితం ఉగాదికి ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 9, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్, మటన్ ధరలు నిలకడగా కొనసాగుతున్నాయి. కార్తీక మాసంలోనూ మాంసం అమ్మకాలు జోరుగా సాగుతుండటంతో రేట్లు తగ్గలేదు. ఇవాళ హైదరాబాద్‌లో స్కిన్ లెస్ చికెన్ కేజీ రూ.220-260, సూర్యాపేటలో రూ.230, కామారెడ్డిలో రూ.250, నిజామాబాద్‌లో రూ.200-220, విజయవాడలో రూ.260, గుంటూరులో రూ.220, మచిలీపట్నంలో రూ.220గా ఉన్నాయి. ఇక మటన్ ధరలు రూ.750-రూ.1,100 మధ్య ఉన్నాయి. మీ ఏరియాలో రేటు ఎంతో కామెంట్ చేయండి.

News November 9, 2025

12న అన్నమయ్య జిల్లాకు CM రాక

image

అన్నమయ్య జిల్లాకు ఈనెల 12న సీఎం చంద్రబాబు వస్తారని సమాచారం. పేదల గృహప్రవేశాల కార్యక్రమంలో పాల్గొనాడానికి గత నెల 29వ తేదీనే చిన్నమండెంకు సీఎం రావాల్సి ఉంది. భారీ వర్షాలతో అప్పుడు పర్యటన రద్దు చేశారు. తాజాగా 12వ తేదీన వస్తారని జిల్లా అధికారులకు సమాచారం అందింది. అధికారికంగా షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది. కడప-బెంగళూరు హైవే పక్కన దేవపట్ల క్రాస్ వద్ద హెలిప్యాడ్ సిద్ధం చేస్తున్నారు.

News November 9, 2025

HYD: చివరి రోజు.. అభ్యర్థుల్లో టెన్షన్!

image

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. అసలే ఆదివారం సెలవు. అభ్యర్థులు ఉదయాన్నే ఓటర్ల డోర్లు తడుతున్నారు. ఉన్నది ఒక్కటే రోజు.. ఎల్లుండే పోలింగ్.. ఎవరినైనా మిస్ అయ్యామా? అనే అంతర్మథనంలో పడుతున్నారు. తాయిళాలు మొదలుపెట్టి గెలుపు కోసం INC, BRS, BJP సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తున్నాయి. ఎంత చేసినా సైలెంట్ ఓటింగ్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌ను పెంచుతోంది.