News April 5, 2025
NGKL: డిగ్రీ విద్యార్థి SUICIDE

బల్మూర్ మండలంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. తుమ్మెన్పేటకు చెందిన అరవింద్(20) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వారం రోజుల క్రితం ఉగాదికి ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 11, 2025
నాకేం తొందర లేదు.. సీఎం మార్పు వార్తలపై డీకే శివకుమార్

కర్ణాటకలో సీఎం మార్పు వార్తలపై Dy.CM డీకే శివకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో తొందరేం లేదని, తన తలరాత ఏంటో తనకు తెలుసని అన్నారు. ‘నేను సీఎం అయ్యేందుకు సమయం ఆసన్నమైంది’ అని తాను అన్నట్లు వార్తలు రావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొన్ని మీడియా ఛానళ్లు నిజాలను వక్రీకరించి సెన్సేషనలిజం, పాలిటిక్స్ చేస్తున్నాయని మండిపడ్డారు. కాగా నవంబర్లో సర్కారులో మార్పులొస్తాయని ఊహాగానాలు సాగుతున్నాయి.
News October 11, 2025
నిజామాబాద్: చిట్టితల్లి హృదయం చిన్నబొతోంది..!

చదువుకోవలసిన వయసులో బాలికలకు వివాహాలు చేస్తున్నారు. ఆడుకోవాల్సిన వయసులో చిట్టి తల్లులు, మరో చిట్టి తల్లిని లాలించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అభం శుభం తెలియని చిన్నారులను తల్లిదండ్రులు బలి పశువులను చేస్తున్నారు. పెళ్లి అనే బంధం తెలియకుండానే వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో పది నెలల వ్యవధిలో 22 బాల్య వివాహాలను అడ్డుకున్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
News October 11, 2025
రామగిరి: హత్య కేసులో నిందితుల అరెస్ట్

రామాగిరి సెంటినరీకాలనీలో కోట చిరంజీవిని హత్య చేసిన నిందితుల్ని శనివారం అరెస్టు చేసినట్లు గోదావరిఖని ఏసీపీ మడత రమేష్ గౌడ్ తెలిపారు. పెంచికల్ పేట్కు చెందిన సంధ్యా రాణిని చిరంజీవి వేధిస్తుండటంతో కుటుంబ సభ్యులకు తెలిపింది. వేధింపులు ఎక్కువ కావడంతో సంధ్యా రాణి తన అన్న, భర్త, తండ్రి, బావమరిదిలతో కలిసి ఇనుప రాడ్తో కొట్టి హత్య చేసినట్లు ఆసీఫ్ తెలిపారు.