News April 5, 2025
NGKL: డిగ్రీ విద్యార్థి SUICIDE

బల్మూర్ మండలంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన నిన్న రాత్రి జరిగింది. స్థానికుల వివరాలు.. తుమ్మెన్పేటకు చెందిన అరవింద్(20) ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నాడు. వారం రోజుల క్రితం ఉగాదికి ఇంటికి వచ్చాడు. శుక్రవారం రాత్రి వ్యవసాయ పొలం వద్ద ఎవరూ లేని సమయంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Similar News
News October 9, 2025
ఈ నెల 13 నుంచి స్కూళ్లకు కొత్త టీచర్లు

AP: మెగా DSCలో ఎంపికైన టీచర్లు ఈ నెల 13న స్కూళ్లలో చేరనున్నారు. పోస్టింగ్ల కోసం వెబ్ ఆప్షన్ల నమోదుకు 9, 10 తేదీల్లో అవకాశం ఇచ్చారు. ఆప్షన్ల నమోదు అనంతరం 11 లేదా 12వ తేదీన స్కూళ్ల కేటాయింపు పత్రాలను అందజేస్తారు. 16,347 పోస్టులకు మెగా DSC నిర్వహించగా, 15,941 ఉద్యోగాలు భర్తీ అయ్యాయి. రిజర్వేషన్ అభ్యర్థులు లేకపోవడంతో కొన్ని పోస్టులు మిగిలాయి. కాగా కొత్త టీచర్లకు ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయింది.
News October 9, 2025
కాకినాడకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గురువారం కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ఆయన హెలికాప్టర్లో కాకినాడ చేరుకుంటారు. కలెక్టరేట్లో మత్స్యకార సంఘాలు, కమిటీ ప్రతినిధులతో కాలుష్యం, నష్టపరిహారం చెల్లింపు అంశాలపై సమావేశమవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు ఉప్పాడ సెంటర్లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం రాజమండ్రి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం వెళతారు.
News October 9, 2025
స్థానిక సమరం.. వికారాబాద్ రెడీ

స్థానిక సంస్థల ఎన్నికలకు వికారాబాద్ జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఎన్నికలపై హైకోర్టు బుధవారం అభ్యంతరం చెప్పకపోవడంతో నేడు MPTC/ZPTC నోటిఫికేషన్ విడుదల కానుంది. వికారాబాద్ జిల్లాలో 227 ఎంపీటీసీ, 20 ఎంపీపీ, 20 జడ్పీటీసీ స్థానాలకు రెండు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. కాగా, జిల్లా వ్యాప్తంగా 594 గ్రామ పంచాయతీలు, 5058 వార్డులున్నాయి. ఇప్పటికే పల్లెల్లో ఎన్నికల సందడి నెలకొంది.