News April 14, 2025
NGKL: డీఎస్పీ నుంచి బీఎస్పీలోకి చేరికలు

BSP తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ సమక్షంలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మిద్దె శివప్రసాద్ (నాగర్ కర్నూల్), పంజుగుల శంకర్ (కల్వకుర్తి), మల్లెపాకుల సైదులు (అచ్చంపేట) ధర్మ సమాజ్ పార్టీని వీడి బహుజన్ సమాజ్ పార్టీలో సోమవారం చేరారు. మంద ప్రభాకర్ పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. స్టేట్ సెంట్రల్ కోఆర్డినేటర్ దయానందరావు, రాష్ట్ర నాయకులు శివరామకృష్ణ, అంతటి నాగన్న తదితరులు పాల్గొన్నారు.
Similar News
News April 16, 2025
నగ్న చిత్రాలతో బ్లాక్ మెయిల్.. నిందితుడి అరెస్ట్

డబ్బు కోసం యువతిని నగ్న చిత్రాలతో బెదిరిస్తున్న కర్నూలు(D) కల్లూరు(M) తటకనాపల్లికి చెందిన హరీశ్ను అరెస్టు చేసినట్లు ఆలమూరు SI అశోక్ తెలిపారు. కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించినట్లు చెప్పారు. మూడేళ్ల క్రితం ఓ యాప్ ద్వారా యువతి పరిచయమైందని తెలిపారు. నగ్నంగా వీడియో కాల్ మాట్లాడటంతో స్క్రీన్ షాట్స్ తీసి మూడు ఇన్స్టా ఖాతాల్లో పోస్ట్ చేసి వేధించాడని వెల్లడించారు.
News April 16, 2025
TTD గోశాల బాగానే ఉంది: నారాయణ

TTD గోశాలలో సిబ్బంది నిర్లక్ష్యం ఎక్కడా లేదని CPIజాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. తిరుపతిలోని గోశాలను బుధవారం పరిశీలించారు. గోవుల ఆరోగ్య పరిస్థితి, వాటికి అందిస్తున్న దాణా గురించి తెలుసుకున్నారు. ‘గోవులకు కావాల్సినంత దాణా ఉంది. గోవుల ఆరోగ్యాన్ని వైద్యులు రోజూ పర్యవేక్షిస్తున్నారు. గోశాల మాజీ డైరెక్టర్ హరినాథరెడ్డిపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆయనను సస్పెండ్ కాదు విధుల నుంచి తొలగించాలి’ అని ఆయన కోరారు.
News April 16, 2025
పార్వతీపురం: సమ్మర్ హాలీడేస్లో వీటిపై ఓ లుక్కేయండి

వేసవి సెలవులకు పార్వతీపురం మన్యం జిల్లా స్వాగతం పలుకుతుంది. సెలవుల్లో కుటుంబ సమేతంగా వచ్చిన వారికి పర్యాటక ప్రాంతాలు వేదిక కానున్నాయి. సీతంపేట అడ్వెంచర్ పార్క్, తోటపల్లి ఐటీడీఏ పార్కు, సీతంపేట కడలి వ్యూ పాయింట్, తోటపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, విశ్వేశ్వర దేవాలయం వంటి మరెన్నో పర్యాటక ప్రాంతాలను సందర్శించి మన్యం అందాల మధ్య ఆహ్లాదం పొందవచ్చు.