News February 2, 2025

NGKL: తరగతి గదిలో చరవాణిలను వినియోగిస్తే చర్యలు: డీఈఓ

image

నాగర్ కర్నూల్ మండలంలోని గగ్గలపల్లి ప్రాథమిక పాఠశాల తరగతి గదిలో సెల్‌ఫోన్‌ మాట్లాడుతున్న ఇద్దరు ఉపాధ్యాయులపై డీఈఓ రమేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇద్దరు ఉపాధ్యాయుల సెల్ ఫోన్లను అయన సీజ్ చేశారు. శనివారం మండల పరిధిలోని గద్దలపల్లి ప్రాథమిక పాఠశాలలో తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యాబోధన చేయకుండా సెల్ఫోన్లను వినియోగిస్తున్న అంశాన్ని డీఈవో గుర్తించి, ఇద్దరు ఉపాధ్యాయులపై డిఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News February 28, 2026

NIT తిరుచిరాపల్లిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

<>NIT <<>>తిరుచిరాపల్లి 9 టెక్నికల్ అసిస్టెంట్, జూనియర్ ఇంజినీర్, లైబ్రరీ& ఇన్ఫర్మేషన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టును బట్టి ఐటీఐ, డిప్లొమా, BE/BTech, BLSc, పీజీ అర్హత గలవారు మార్చి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 31 వరకు పంపాలి. షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.nitt.edu/

News February 28, 2026

ఖమ్మం: పేరుకు మాత్రమే పేదల పార్టీ: ఈటల

image

కనికరం లేకుండా పేదల ఆవాసాలను కూల్చివేసి తప్పు జరిగినందుకు ముఖ్యమంత్రి బేషరతుగా బాధితులకు క్షమాపణ చెప్పాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. పేదలు ఓట్లు వేస్తే గద్దెనెక్కిన ఈ పార్టీ పేరుకు మాత్రమే పేదల పార్టీ అని చేతల్లో మాత్రం రాక్షస పార్టీ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి బాధితులకు సత్వర న్యాయం చేయాలని, కూల్చిన చోటే ఇళ్లు కట్టించి ఇవ్వాలన్నారు. లేకుంటే ప్రజా తిరుగుబాటు తప్పదన్నారు.

News February 28, 2026

సామాన్య భక్తులకు వీఐపీ సౌకర్యాలు: అడ్లూరి

image

2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈసారి 4 కోట్ల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. రూ.940 కోట్లతో అభివృద్ధి పనుల ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పారిశుద్ధ్యం, పార్కింగ్, నిరంతర విద్యుత్, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.సామాన్య భక్తులకు కూడా వీఐపీ స్థాయి సౌకర్యాలు కల్పించాలని అన్నారు.