News April 8, 2025
NGKL: దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులను ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల సమస్యలపై సకాలంలో తగిన సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కలెక్టర్ అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) పి అమరేందర్, ఏఓ చంద్రశేఖర్, సూపరిండెంటెంట్లు, అధికారులు ఉన్నారు.
Similar News
News November 18, 2025
VKB: పాఠశాలల్లో బాలల సభలు నిర్వహించాలి: కలెక్టర్

మండలంలోని పాఠశాలల్లో బాలల కోసం బాలసభలు నిర్వహించాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత అధికారులకు సూచించారు. మంగళవారం వికారాబాద్ డీపీఆర్సీ భవనంలో బాలసభల నిర్వహణకు పంచాయతీ సెక్రెటరీలు, మండల పంచాయతీ అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మండలంలో ఎంపిక చేసిన పాఠశాలల్లో ఈ నెల 20న బాలల సభలు నిర్వహించాలన్నారు. బాలల సభల ద్వారా విద్యార్థులకు అనేక విషయాలపై అవగాహన చేయాలన్నారు.
News November 18, 2025
గురువారం గ్రీవెన్స్, ఉద్యోగవాణి యథాతథం: కలెక్టర్

గురువారం నిర్వహించే ప్రత్యేక గ్రీవెన్స్ (ఫిర్యాదుల స్వీకరణ), ఉద్యోగవాణి కార్యక్రమం యథాతథంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. ప్రజలు, ఉద్యోగులు వారి యొక్క సమస్యలపై దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఆయన అన్నారు. కావున, జిల్లా ప్రజలు తమ ఫిర్యాదులను ఇవ్వడానికి కలెక్టరేట్కు రావచ్చని కలెక్టర్ కోరారు.
News November 18, 2025
రేపు నెల్లూరు జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదు.!

నెల్లూరు జిల్లా వ్యాప్తంగా రైతులు ఆశగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ రెండో విడత నిధులు బుధవారం వారి ఖాతాలకు జమ కాబోతున్నాయి. అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం.. జిల్లాలో 1.95 లక్షల మంది రైతుల ఖాతాలకు రూ.130.20 కోట్లు జమ అవుతాయన్నారు. నియోజకవర్గాలవారిగా ఎమ్మెల్యేలు, కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.


