News March 29, 2025

NGKL: దోమలపెంట వద్ద రోడ్డు ప్రమాదం.. UPDATE

image

శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి <<15928031>>దోమల పెంట సమీప అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం<<>>లో మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్ దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాలు.. పోలీసు అకాడమీలో విధులు నిర్వహిస్తున్న సుధాకర్ పటేల్‌తో పాటు మరో వ్యక్తి భగవత్ కృష్ణారావు మృతి చెందారు. శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో వీరిరువురు మృతి చెందారు.

Similar News

News February 26, 2026

సిరిసిల్ల: ఖాళీగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పోస్ట్

image

రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) పోస్టు ఖాళీగా మిగిలింది. గత అక్టోబరు నెలలో స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్‌గా నియమితులైన గరీమా అగ్రవాల్.. జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్‌గా సైతం అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. ఐఏఎస్ అధికారుల తాజా బదిలీలలో ఆమెను జిల్లా కలెక్టర్‌గా నియమించారు. ప్రస్తుతం అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) పోస్టులో ఎవరినీ నియమించకపోవడంతో ఆ పోస్టు ఖాళీగా మిగిలిపోయింది.

News February 26, 2026

విజయ్-రష్మిక పెళ్లి విందులో పోర్క్ కర్రీ!

image

విజయ్-రష్మిక పెళ్లి విందులో అతిథులకు పసందైన వంటకాలు రెడీ చేశారు. మెనూలో తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ, నాటుకోడి పులుసు, గారెలు, పప్పు, పచ్చిపులుసు, ఓల్డ్ సిటీ కీమా సమోసాలు ఉన్నాయి. ఇక కర్ణాటక స్పెషల్ బిసిబెలే బాత్, పంది (పోర్క్) కర్రీ, మైసూర్ పాక్ వడ్డించనున్నట్లు సమాచారం. కాగా తాను ‘కొడగు’ సంప్రదాయమైన పంది కూర తింటానని గతంలో రష్మిక చెప్పడం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే.

News February 26, 2026

ఏప్రిల్ 25న పాలిసెట్.. గుంటూరులో పలు కేంద్రాలు

image

పాలిసెట్-2026 ప్రవేశ పరీక్షను ఏప్రిల్ 25న నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లాలో పలు ప్రధాన కోఆర్డినేటింగ్ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గుంటూరులోని MBTS, మహిళా, మైనారిటీ పాలిటెక్నిక్, టెక్స్‌టైల్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, పొన్నూరు పాలిటెక్నిక్ కళాశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి పరిధిలో మంగళగిరి, తెనాలి తదితర ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలున్నాయి.