News March 29, 2025
NGKL: దోమలపెంట వద్ద రోడ్డు ప్రమాదం.. UPDATE

శ్రీశైలం-హైదరాబాద్ ప్రధాన రహదారి <<15928031>>దోమల పెంట సమీప అటవీ ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదం<<>>లో మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి సుధాకర్ పటేల్ దుర్మరణం పాలయ్యారు. పోలీసుల వివరాలు.. పోలీసు అకాడమీలో విధులు నిర్వహిస్తున్న సుధాకర్ పటేల్తో పాటు మరో వ్యక్తి భగవత్ కృష్ణారావు మృతి చెందారు. శ్రీశైలం దర్శనానికి వెళ్తుండగా హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో వీరిరువురు మృతి చెందారు.
Similar News
News December 2, 2025
NGKL: రెండో రోజు దాఖలైన నామినేషన్ వివరాలు!

NGKL జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. రెండో రోజు మొత్తం 280 నామినేషన్లు దాఖలయ్యాయి. పెద్దకొత్తపల్లిలో అత్యధికంగా 72 నామినేషన్లు వచ్చాయి. కొల్లాపూర్ (39), కోడేరు (37), నాగర్కర్నూల్ (45), తిమ్మాజీపేట (48), బిజినపల్లి (22), పెంట్లవెల్లి (17) నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో ఇప్పటివరకు మొత్తం 151 గ్రామాలకు గాను 458 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.
News December 2, 2025
PCOSని తగ్గడానికి ఏం చేయాలంటే?

మంచి జీవనశైలిని పాటిస్తూ ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకున్నారంటే పీసీఓఎస్ అదుపులోకి వస్తుందని.. అప్పుడు గర్భం ధరించే అవకాశం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. డైలీ శారీరక శ్రమ, తగినంత నిద్రతో పాటు రోజూ ఒకే సమయానికి ఆహారం తినడం కూడా కీలకం. ముఖ్యంగా విటమిన్ బి ఉన్న ఆహారాలు తీసుకోవాలి. కొందరిలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నప్పటికీ బరువు కంట్రోల్లోనే ఉంటుంది. దీన్ని లీన్ పీసీఓఎస్ అంటారు.
News December 2, 2025
విశాఖ: ‘మా కొడుకును కోడలే చంపింది’

విశాఖలో ఓ వ్యక్తి ఆదివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. కిశోర్, మౌనిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ దొండపర్తి సమీపంలోని కుప్పిలి వీధిలో ఉంటున్నారు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా.. కిశోర్ ఉరివేసుకున్నాడు. అయితే కోడలే తమ కొడుకుని హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తోందని కిశోర్ తల్లి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.


