News April 12, 2025

NGKL: నల్లమలలో దద్దరిల్లిన శివనామ స్మరణం

image

‘వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య’ అంటూ చేసిన శరణుఘోషతో నల్లమల అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు రాంపూర్ పెంట వరకు వచ్చిన భక్తులు అక్కడినుంచి నాలుగు కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. సలేశ్వరం క్షేత్రం వద్ద 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం వద్ద భక్తులు సందడి చేశారు.

Similar News

News December 10, 2025

ఎన్నికల రోజు స్థానిక సెలవు: జిల్లా కలెక్టర్

image

ఆసిఫాబాద్ జిల్లాలో మూడు విడతలుగా జరిగే గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంతో ఆయా మండలాల్లో పోలింగ్ రోజు స్థానిక సెలవులు ఇవ్వనున్నట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే పేర్కొన్నారు. డిసెంబర్ 11, 14, 17న పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆయా మండలాల్లో స్థానికంగా సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. మొదటి విడతలో 5 మండలాల పాఠశాలకు సెలవులు ప్రకటించారు.

News December 10, 2025

కృష్ణా: 1500కి పైగా ప్రమాదాలు.. కారణం అదేనా..?

image

భారీ లోడుతో, ఫిట్‌నెస్ లేని వాహనాల కారణంగా ఈ ఏడాది ఉమ్మడి కృష్ణాలో 1500కు పైగా ప్రమాదాలు జరిగాయి. వీటిని తనిఖీ చేసి సీజ్ చేయాల్సిన రవాణా శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా రోడ్డు సేఫ్టీ అధికారులు మామూళ్ల మత్తులో ఉండి వాహనాలను పట్టిపట్టనట్లు వదలడంతోనే అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

News December 10, 2025

1,284 మంది బైండోవర్: ఎస్పీ నరసింహ

image

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 170 సమస్యాత్మక గ్రామాలు గుర్తించామని ఎస్పీ నరసింహ చెప్పారు. గత ఎన్నికల్లో కేసుల్లో ఉన్నవారు, పాత నేరస్థులు, సమస్యలు సృష్టించే అవకాశం ఉన్నవారు 1,284 మందిని ముందస్తుగా బైండోవర్ చేశామన్నారు. 136 కేసుల్లో రూ.9,50,000 విలువైన 1,425 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపాపారు. లైసెన్స్ కలగిన 53 ఆయుధాలను డిపాజిట్ చేయించామన్నారు.