News April 12, 2025

NGKL: నల్లమలలో దద్దరిల్లిన శివనామ స్మరణం

image

‘వస్తున్నాం.. వస్తున్నాం.. లింగమయ్య’ అంటూ చేసిన శరణుఘోషతో నల్లమల అటవీ ప్రాంతం దద్దరిల్లింది. ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాలు రాంపూర్ పెంట వరకు వచ్చిన భక్తులు అక్కడినుంచి నాలుగు కిలోమీటర్లు దట్టమైన అటవీ ప్రాంతంలో కాలినడకన వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. సలేశ్వరం క్షేత్రం వద్ద 200 అడుగుల ఎత్తు నుంచి జాలువారే జలపాతం వద్ద భక్తులు సందడి చేశారు.

Similar News

News November 6, 2025

హైటెక్స్‌లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ 2025

image

HYDలో నవంబర్ 25- 28 వరకు దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో జరగనుంది. వన్ నేషన్ వన్ EXPO థీమ్‌తో జరిగే ఈవెంట్‌లో 50 దేశాల నుంచి 500 ఎగ్జిబిటర్స్, 40,000 కుపైగా సందర్శకులు పాల్గొంటారు. 35,000 చదరపు మీటర్లలో తాజా పౌల్ట్రీ సాంకేతికతలు, సస్టైనబుల్ సొల్యూషన్స్ ప్రదర్శించబడతాయి. దేశ పౌల్ట్రీ రంగం రూ.1.35 లక్షల కోట్లతో ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తోందని నిర్వాహకులు తెలిపారు.

News November 6, 2025

HYD: గోపి నా పెద్దకొడుకని అక్షరను హత్తుకున్న అవ్వ

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో భాగంగా బీఆర్ఎస్ నాయకులు రహమాత్‌నగర్‌లోని ఫాతిమా నగర్‌లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇందులో ఓ అవ్వ ‘గోపీ నా పెద్ద కొడుకు అని గుర్తు తలుచుకుంటూ.. నా మనుమరాలు అని ఆప్యాయంగా అక్షరను దగ్గరకు తీసుకొని మనస్ఫూర్తిగా దీవించారు. మాగంటి సునీత అధిక మెజార్టీతో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గంటెపాక నరేష్, దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు.

News November 6, 2025

జూబ్లీ సర్వేల వెనుక కేటీఆర్ కుట్ర: చనగాని దయాకర్

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కేటీఆర్ వెనుక ఉండి చేయిస్తున్న ఫేక్ సర్వేలతో ప్రజల అభిప్రాయం మారదని టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్ మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాట్లాడుతూ.. ఫేక్ సర్వేలు పూర్తి ప్రజా అభిప్రాయం కాదన్నారు. సర్వేల వెనుక కేటీఆర్ కుట్ర ముమ్మాటికి ఉందని అందుకే సర్వేల ఆర్టిస్టులు బయటకు వచ్చారన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు ముమ్మాటికి అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు.