News February 21, 2025
NGKL: నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన.. రూ.5 లక్షల సబ్సిడీ

సీఎం రేవంత్ నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.
Similar News
News December 5, 2025
మదనపల్లెలో ఆసుపత్రి గుర్తింపు రద్దు..!

మదనపల్లిలోపి ఎస్బీఐ కాలనీలోని ఓ ఆసుపత్రి గుర్తింపును రద్దు చేస్తూ శుక్రవారం కలెక్టర్ నిశాంత్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ లక్ష్మీ నరసయ్య కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సిబ్బందితో కలిసి ఆసుపత్రి ప్రధాన ద్వారానికి నోటీసులు అంటించారు. ఆస్పత్రిలో నేటి నుంచి ఎలాంటి వైద్య సేవలు అందవని బ్యానర్ ఏర్పాటు చేశామని అధికారులు అన్నారు.
News December 5, 2025
నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలి: కలెక్టర్

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ ఆదేశించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ ఆఫీసర్లకు ఎల్లారెడ్డిపేట మండలం
రైతు వేదికలో శుక్రవారం ఇన్ఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హాజరై ఎన్నికల నిర్వహణ, వివిధ అంశాలపై శిక్షణ ఇచ్చారు. పీపీటీ ప్రదర్శన ఇచ్చి ప్రతి అంశంపై వివరించారు.
News December 5, 2025
కూకట్పల్లిలో సూర్యాపేట ఓటర్లు.. సిటీలో అభ్యర్థుల పాట్లు.!

సూర్యాపేట జిల్లా చిల్పకుంట్ల ఓటర్లు కూకట్పల్లిలో దాదాపు 700 మంది ఉంటున్నారు. ఇక్కడే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఓట్ల కోసం అక్కడ పోటీచేసే సర్పంచ్ అభ్యర్థులు సిటీకి వచ్చి ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. 3 రోజులుగా ఓటర్లను కలుస్తూ ఏం కావాలో అది చేస్తామని హామీలిస్తున్నారు. ఎల్లమ్మబండ, బాలానగర్, ఫతేనగర్, మూసాపేట ప్రాంతాల్లో పలువురు నివాసముంటున్నారు. ఈనెల 11, 14, 17న ఎన్నికలు జరుగనున్నాయి.


