News February 21, 2025
NGKL: నేడు ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన.. రూ.5 లక్షల సబ్సిడీ

సీఎం రేవంత్ నేడు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేయనున్నారు. నారాయణపేట జిల్లా అప్పకపల్లెలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. కాగా సర్కారు తొలివిడతలో రాష్ట్రవ్యాప్తంగా 72,045 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. వాటన్నింటికీ రేపు శంకుస్థాపనలు మొదలు కానున్నాయి. ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల పూర్తి సబ్సిడీతో ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది. బేస్మెంట్ కట్టగానే రూ.లక్ష లబ్ధిదారుడి ఖాతాలో జమ చేస్తారు.
Similar News
News November 20, 2025
ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధరల వివరాలు

ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం పత్తి, వేరుశనగ, ఆముదాల ధరలు ఇలా ఉన్నాయి. పత్తి క్వింటా కనిష్ఠ ధర రూ.3,976, గరిష్ఠ ధర రూ.7,330 పలికింది. వేరుశనగ కనిష్ఠ ధర రూ.3,700, గరిష్ఠ ధర రూ.6,636 వరకు నమోదైంది. ఆముదాలు కనిష్ఠంగా రూ.5,109, గరిష్ఠంగా రూ.5,924 వరకు అమ్ముడయ్యాయి. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం చూపుతూ పంటలు కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
News November 20, 2025
కడప జిల్లా వ్యాప్తంగా పెరిగిన చలి తీవ్రత.!

కడప జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగింది. దీంతో పలుచోట్ల మంచు ప్రభావంతో చిరు వ్యాపారులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది డిసెంబర్ ప్రారంభం కాకముందే చలి అధికంగా ఉండడంతో డిసెంబర్ నెలలో మరింత ఎక్కువ చలి ప్రభావం ఉంటుందని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు చెబుతున్నారు. వాహనదారులు మరింత అప్రమత్తంగా ఉండాలని, స్థానికులు అవసరం అయితే తప్ప తెల్లవారుజామున ప్రయాణాలు చేయవద్దన్నారు.
News November 20, 2025
చింతూరు: తవుడు బస్తాల మాటున గంజాయి రవాణా

చింతూరు మండలం ఎర్రంపేట సమీపంలో బుధవారం సాయంత్రం గంజాయి తరలిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్కు బొలెరో వాహనంలో క్రింద గంజాయి, పైన తవుడు బస్తాలు వేసి తరలిస్తుండగా పట్టుకున్నామని చెప్పారు. పట్టుబడిన గంజాయి 120కిలోలు రూ.6లక్షలు ఉంటుందన్నారు. ఒరిస్సా మల్కాన్గిరికి చెందిన ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామన్నారు.


