News February 20, 2025
NGKL: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండిని కలిసిన ఎంపీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చంద్రను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంటు పరిధిలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి, అల్లంపూర్ నియోజకవర్గాలలోని యువత గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకునే విధంగా లోన్ మేళా నిర్వహించాలని కోరినట్లు, ఆయన సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
Similar News
News October 19, 2025
నయా నరకాసురులకు గుణపాఠం చెప్పాలి: పవన్

AP: ప్రజలకు Dy.CM పవన్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ‘చీకటిపై వెలుగు, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక దీపావళి. ఆ స్ఫూర్తితో నయా నరకాసురులను ప్రజాస్వామ్య యుద్ధంలో ప్రజలు ఓడించారు. ఆ అక్కసుతో మారీచుల్లాంటి ఈ నరకాసురులు రూపాలు మార్చుకుంటూ ప్రజల మధ్య విభేదాలు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారు. వీరికి గుణపాఠం చెప్పాలి. ఆడపడుచులు సత్యభామ స్ఫూర్తిని అందిపుచ్చుకోవాలి’ అని ట్వీట్ చేశారు.
News October 19, 2025
సూర్యాపేట: చెరువులో పడి యువకుడి మృతి

మోతె మండలం మామిళ్లగూడెంలో ఓ యువకుడు చెరువులో జారిపడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జూలకంటి సురేందర్ రెడ్డి (34) శనివారం రాత్రి చెరువు వద్దకు వెళ్లగా ప్రమాదవశాత్తూ అందులో పడి చనిపోయాడు. సురేందర్ రెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
News October 19, 2025
ఆర్మీలో 90 ఆఫీసర్ ఉద్యోగాలు

ఇండియన్ ఆర్మీ జులై 2026లో ప్రారంభమయ్యే 55వ 10+2 TES కోసం అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఇంటర్ (M.P.C)లో 60% మార్కులతో పాసై, JEE మెయిన్స్-2025 అర్హత సాధించినవారు NOV 13వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, స్టేజ్-1, స్టేజ్-2 పరీక్షలు, SSB ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ద్వారా 90మందిని ఎంపిక చేస్తారు. 4ఏళ్ల ట్రైనింగ్ తర్వాత ఇంజినీరింగ్ డిగ్రీతో పాటు లెఫ్టినెంట్ ఉద్యోగం లభిస్తుంది.