News February 20, 2025
NGKL: పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎండిని కలిసిన ఎంపీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మేనేజర్ అశోక్ చంద్రను నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి గురువారం ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్లమెంటు పరిధిలోని అచ్చంపేట, కల్వకుర్తి, కొల్లాపూర్, గద్వాల, నాగర్ కర్నూల్, వనపర్తి, అల్లంపూర్ నియోజకవర్గాలలోని యువత గ్రామీణ ప్రాంతాలలో స్వయం ఉపాధి ఏర్పాటు చేసుకునే విధంగా లోన్ మేళా నిర్వహించాలని కోరినట్లు, ఆయన సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
Similar News
News November 14, 2025
నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించాలి: DM&HO

మాతా శిశు సేవల ద్వారా గర్భిణులను గుర్తించి సకాలంలో రికార్డుల్లో నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ డీ.కృష్ణమూర్తి నాయక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పాడేరు డీఎంహెచ్వో కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. మాతా శిశువులకు నిర్ధేశించిన సమయానికి వ్యాధి నిరోధక టీకాలు అందించాలని సూచించారు. ఈనెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జాతీయ నవజాత శిశు వారోత్సవాలు నిర్వహించాలన్నారు.
News November 14, 2025
18 నెలల్లో రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు: CBN

AP: కూటమి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించినట్లు CII సదస్సులో సీఎం చంద్రబాబు ప్రకటించారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఇన్వెస్ట్మెంట్స్ రాబట్టగలిగామని వివరించారు. అటు రాష్ట్రంలో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి లులూ గ్రూప్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఎం CBN, లులూ ఛైర్మన్ యూసుఫ్ అలీ సమక్షంలో అధికారులు, సంస్థ ప్రతినిధులు అంగీకార పత్రాలు మార్చుకున్నారు.
News November 14, 2025
కాకినాడ కలెక్టర్ కీలక ప్రకటన

కాకినాడ జిల్లాలో దివ్యాంగుల సదరం స్లాట్ బుకింగ్ ప్రారంభించినట్లు కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడించారు. శుక్రవారం నుంచి డిసెంబర్ వరకు స్లాట్స్ బుకింగ్ కొనసాగుతుందని తెలిపారు. ఇప్పటికే వెయిటింగ్ లిస్టులో ఉన్నవారికి స్లాట్ బుకింగ్లో తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. కొత్త దరఖాస్తులకు తేదీ ఖరారు చేస్తామని చెప్పారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి మంగళవారం వైద్య పరీక్షలు నిర్వహిస్తారన్నారు.


