News April 6, 2025

NGKL: పండగను శాంతియుతంగా చేసుకోవాలి: కలెక్టర్

image

నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ శ్రీరామ నవమి సందర్భంగా జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రజలందరిపై భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ప్రజలు శాంతియుతంగా ఆనందోత్సవాల మధ్య పండగను చేసుకోవాలన్నారు. ప్రకృతిని రక్షించాలని అప్పుడే మనం రాబోయే తరాలకు బంగారు భవిష్యత్తును అందించిన వారమవుతామని తెలిపారు.

Similar News

News November 18, 2025

అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ అరెస్ట్

image

హరియాణా ఫరిదాబాద్‌లోని అల్ ఫలాహ్ వర్సిటీ ఛైర్మన్ జావెద్ అహ్మద్ సిద్ధిఖీని మనీలాండరింగ్ కేసులో ED అధికారులు అరెస్టు చేశారు. ఢిల్లీ పేలుడు, టెర్రర్ మాడ్యూల్ కేసు దర్యాప్తులో భాగంగా నిన్న వర్సిటీ సహా 25 ప్రాంతాల్లో ED సోదాలు నిర్వహించి కీలక ఆధారాలు సేకరించింది. ఈక్రమంలోనే ఆయనను అదుపులోకి తీసుకుంది. కాగా వర్సిటీలో పనిచేసిన ముగ్గురు డాక్టర్లకు ఉగ్ర కుట్రతో సంబంధాలున్నాయన్న కోణంలో విచారణ జరుగుతోంది.

News November 18, 2025

జనగామ జిల్లాలో నేటి టాప్ న్యూస్!

image

> రౌడీ షీటర్లకు పాలకుర్తి సీఐ కౌన్సిలింగ్
> నవాబుపేట రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదిలిన ఎమ్మెల్యే కడియం
> కేంద్ర మంత్రి చేతుల మీదుగా పురస్కారం అందుకున్న జనగామ కలెక్టర్
> జనగామలో యువ వికసిత భారత్ 2k రన్
> ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
> మాదక ద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించిన ఆర్డీవో
> జనగామకు జల సంచాయ్ జన్ భగీరథి అవార్డు

News November 18, 2025

తరాలకు మార్గదర్శకంగా సత్యసాయి బాబా జీవితం: మోదీ

image

AP: రేపు పుట్టపర్తిలో జరిగే శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నానని పీఎం మోదీ ట్వీట్ చేశారు. సమాజ సేవ, ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం సత్యసాయి జీవితం, చేసిన ప్రయత్నాలు తరతరాలకు మార్గదర్శకంగా ఉంటాయని తెలిపారు. సత్యసాయి బాబాతో సంభాషించడానికి ఆయన నుంచి నేర్చుకోవడానికి కొన్ని అవకాశాలు తనకు లభించాయన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే సచిన్ పుట్టపర్తికి చేరుకున్నారు.