News March 3, 2025

NGKL: పాముకాటుతో రైతు మృతి

image

పొలంలో పనిచేస్తున్న రైతును పాము కాటేయటంతో మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలిలా.. ఉర్కొండ మండలం జకినాలపల్లికి చెందిన సాయిరెడ్డి(65) పొలంలో పనిచేసుకుంటుండగా పాము కాటేసింది. దీంతో ఆయన ఇంటికి వెళ్లారు. పరిస్థతి విషమించటంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు.

Similar News

News September 18, 2025

ADB: క్రైస్తవ సంఘాలతో ఛైర్మన్ సమావేశం

image

రాష్ట్ర క్రైస్తవ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఛైర్మన్ దీపక్ జాన్ ఆదిలాబాద్‌లో బుధవారం పర్యటించారు. కలెక్టర్ రాజర్షిషాతో కలిసి క్రైస్తవ సంఘాలు, పాస్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు. క్రైస్తవ శ్మశానవాటికకు భూమి, బీసీ-సీ కుల ధ్రువీకరణ పత్రం, క్రైస్తవ కమ్యూనిటీ హాల్ వంటి వారి సమస్యలను ఆయనకు వివరించారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఛైర్మన్ హామీ ఇచ్చారు.

News September 18, 2025

ఈనెల 22 నుంచి ఓపెన్ స్కూల్ సొసైటీ టెన్త్ ఇంటర్ పరీక్షలు

image

జిల్లాలో టాస్క్ ఓపెన్ స్కూల్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే టెన్త్, ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ రెవిన్యూ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి, TG ఓపెన్ స్కూలింగ్ సొసైటీ (TOSS) SSC & ఇంటర్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. పరీక్షలు సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు రెండు సెషన్లలో ఉంటాయన్నారు.

News September 18, 2025

మంచిర్యాల: ‘RSS, BJPకి రైతాంగ సాయుధ పోరాట గొప్పతనం తెలీదు’

image

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని CPM కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించారు. అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. జిల్లా కార్యదర్శి సంకె రవి మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్ట్‌లని అన్నారు. చరిత్రకు మతం రంగు పూసే RSS, BJPకి రైతాంగ సాయుధ పోరాట గొప్పతనం తెలియదని పేర్కొన్నారు.