News March 3, 2025
NGKL: పాముకాటుతో రైతు మృతి

పొలంలో పనిచేస్తున్న రైతును పాము కాటేయటంతో మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. స్థానికుల వివరాలిలా.. ఉర్కొండ మండలం జకినాలపల్లికి చెందిన సాయిరెడ్డి(65) పొలంలో పనిచేసుకుంటుండగా పాము కాటేసింది. దీంతో ఆయన ఇంటికి వెళ్లారు. పరిస్థతి విషమించటంతో కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో చనిపోయాడు.
Similar News
News December 2, 2025
వర్క్ షాపులను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈనెల 3వ తేదీ రైతు సేవా కేంద్రం పరిధిలో వర్క్ షాపులు పకడ్బందీగా నిర్వహించి రైతు సమస్యలను తెలుసుకుని క్రోడీకరించాలని కలెక్టర్ మహేశ్ కుమార్ వ్యవసాయ, మత్స్య, ఉద్యాన శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం అమలాపురంలోని కలెక్టరేట్లో వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇటీవల రైతన్న మీకోసం కార్యక్రమాల ద్వారా రైతు కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు.
News December 2, 2025
టుడే టాప్ స్టోరీస్

* హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం: CM CBN
* CM చంద్రబాబుపై లిక్కర్ కేసు మూసివేత
*ప్రాజెక్టులకు తక్కువ వడ్డీలకే రుణాలివ్వాలి: CM రేవంత్
* TG: ‘భూధార్’ కార్డుల కోసం ‘mభూధార్ యాప్’
* GHMCలో 27మున్సిపాలిటీల విలీనానికి గవర్నర్ ఆమోదం
* పదేళ్లలో రూ.34 లక్షల కోట్లు పెరిగిన విదేశీ అప్పు
*ఎయిపోర్టుల్లో GPS స్పూఫింగ్ జరిగింది: కేంద్రం
* పెళ్లి చేసుకున్న హీరోయిన్ సమంత, డైరెక్టర్ రాజ్ నిడిమోరు
News December 2, 2025
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP: RTC ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందడుగు పడింది. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లోకి ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు NMUA, ఎంప్లాయీస్ యూనియన్లకు సభ్యత్వం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో జరిగే చర్చల్లో ఆర్టీసీ ఉద్యోగ సంఘాలూ పాల్గొనేందుకు అవకాశం ఉంటుంది. తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి వివరించి పరిష్కారాల కోసం చర్చలు జరపవచ్చు.


