News April 5, 2024
NGKL: ‘పార్లమెంట్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి’

నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఉదయ్ కుమార్ అధికారులకు ఆదేశించారు. నేడు కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల్లో భాగంగా మాక్ పోలింగ్ లో 50 ఓట్లకు తక్కువ కాకుండా వేయాలని, రిజల్ట్ చూసిన తర్వాత ఈవీఎం యంత్రాన్ని క్లియర్ చేసిన అనంతరం అసలైన పోలింగ్ కు సన్నద్ధం కావాలని సూచించారు. పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ జరపాలని సూచించారు.
Similar News
News January 4, 2026
MBNR: ఊళ్లకు వెళ్తున్నారా? తస్మాత్ జాగ్రత్త.!

సంక్రాంతి సెలవులకు ఊర్లకు వెళ్లే ప్రజలు దొంగతనాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ డి.జానకి సూచించారు. ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు తప్పనిసరిగా స్థానిక పోలీస్ స్టేషన్లలో సమాచారం అందించాలని కోరారు. విలువైన నగలు, నగదును బీరువాల్లో ఉంచకుండా జాగ్రత్త పడాలన్నారు. నేరాల నివారణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
News January 4, 2026
జడ్చర్ల: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

జడ్చర్ల మండలంలోని ఒక గ్రామంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. వారం క్రితమే అనారోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 4, 2026
జడ్చర్ల: ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

జడ్చర్ల మండలంలోని ఒక గ్రామంలో ఇంటర్ చదువుతున్న మైనర్ బాలిక శనివారం ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సదరు విద్యార్థిని ఇబ్రహీంపట్నం కస్తూర్బా పాఠశాలలో చదువుతోంది. వారం క్రితమే అనారోగ్యంతో ఇంటికి వచ్చిన ఆమె, ఎవరూ లేని సమయంలో ఈ అఘాయిత్యానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


