News April 3, 2025
NGKL: పిడుగుపాటుకు చనిపోయింది వీళ్లే!

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో<<15978702>> పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే<<>>. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో వచ్చిన భారీ వర్షంలో పిడుగు పడటంతో మండలంలోని కండ్లకుంట ప్రాంతానికి చెందిన సుంకరి సైదమ్మ (35), వీరమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ గాయపడగా ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News April 8, 2025
వికారాబాద్: జిల్లాలో ఇన్కమ్ టాక్స్ దాడులు

జిల్లా పరిధిలోని ఛన్గోముల్ గ్రామంలో సోమవారం ఇన్కమ్ టాక్స్ అధికారి విట్టల్ రావు బృందం దాడులు నిర్వహించింది. గ్రామానికి చెందిన బేగారి ప్రభాకర్ ఇంటిని వరంగల్కు చెందిన పండాల రవళి అద్దెకు తీసుకొని, వ్యాపారం చేస్తున్నట్లు చూపుతూ ఫోర్జరీ సంతకాలు సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. అధికారులు వివరాలు సేకరించినట్లు కార్యదర్శి పరుశురాం తెలిపారు.
News April 8, 2025
నర్వ: లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేసిన ఎమ్మెల్యే, కలెక్టర్

నర్వ మండలం లంకాల గ్రామంలోని రేషన్ దుకాణంలో సోమవారం సన్న బియ్యం పథకాన్ని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ ప్రారంభించారు. అనంతరం రేషన్ కార్డు లబ్ధిదారులు రాములమ్మ ఇంట్లో సన్న బియ్యంతో వండిన అన్నం భోజనం చేశారు. ఈ సంధర్బంగా రాములమ్మతో మాట్లాడారు. బియ్యం ఎలా వున్నాయని, అన్న ఎలా అయిందని అడిగి తెలుసుకున్నారు. సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
News April 8, 2025
‘ఆక్వా’కోసం చంద్రబాబు ఢిల్లీ వెళ్తారు: ఆనం

AP: CM చంద్రబాబు ఆక్వా సమస్యల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టారని TDP సీనియర్ నేత ఆనం వెంకటరమణారెడ్డి తెలిపారు. ‘త్వరలోనే బాబు ఢిల్లీకి వెళ్లి వాణిజ్యమంత్రిని కలుస్తారు. US సుంకాల కారణంగా ఆక్వా సంక్షోభం తలెత్తింది. దీనిపై ఇప్పటికే కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. చైనా, థాయ్లాండ్కు ఎగుమతి చేసే మార్గాన్ని పరిశీలించాలని సూచించారు’ అని పేర్కొన్నారు.