News April 3, 2025
NGKL: పిడుగుపాటుకు చనిపోయింది వీళ్లే!

నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలో <<15978702>>పిడుగుపాటుకు ఇద్దరు మహిళలు మృతిచెందిన విషయం తెలిసిందే<<>>. వేరుశనగ పొలాల్లో కూలీ పనులకు వెళ్లిన సమయంలో వచ్చిన భారీ వర్షంలో పిడుగు పడటంతో మండలంలోని కండ్లకుంట ప్రాంతానికి చెందిన సుంకరి సైదమ్మ (35), వీరమ్మ (55) అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మ గాయపడగా ఆమెను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Similar News
News October 27, 2025
ప్రజావాణికి 112 దరఖాస్తులు: HNK కలెక్టర్

HNK కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 112 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ స్నేహ శబరీష్, అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వై.వి.గణేష్, హనుమకొండ, పరకాల ఆర్డీవోలు రాథోడ్ రమేష్, డా.నారాయణ, జిల్లా అధికారులు, తహశీల్దార్లు పాల్గొన్నారు.
News October 27, 2025
రేపు జరగాల్సిన పోలీస్ సైకిల్ ర్యాలీ 29కి వాయిదా

శాంతి భద్రతల కోసం ప్రాణాలు అర్పించిన పోలీస్ అమరవీరులను స్మరిస్తూ రేపు నిర్వహించాల్సిన సైకిల్ ర్యాలీ అనివార్య కారణాలతో 29కి వాయిదా వేస్తున్నట్లు సీపీ తెలిపారు. కార్యాలయం నుంచి ప్రారంభం అయ్యే ఈ సైకిల్ ర్యాలీ యువతీ, యువకులు, ప్రజలు ఉత్సాహంగా పాల్గొని అమరవీరులకు నివాళులర్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ కోరారు.
News October 27, 2025
వనపర్తి జిల్లాకు రెయిన్ అలెర్ట్

వనపర్తిలో ఈరోజు రాత్రి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ రాత్రి 10 గంటల నుండి అర్ధరాత్రి వరకు ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే రేపు కూడా జిల్లాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కాగా ఇప్పటికే పలుచోట్ల చిరుజల్లులు కురుస్తున్నాయి. మీ ప్రాంతంలో వర్షం కురుస్తుందా.? COMMENT చేయండి.


